మరో రెండు వారాలు మిథున్‌కు ఉపశమనం

సిట్ అధికారులు దాఖ‌లు చేసిన కౌంట‌ర్‌ను ప‌రిశీలించి, రిజైన్డ‌ర్ వేయ‌డానికి త‌మ‌కు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని మిథున్ త‌ర‌పు న్యాయ‌వాదులు కోరారు.

లిక్క‌ర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కూట‌మి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఏపీ హైకోర్టులో మిథున్‌ రెడ్డికి చుక్కెదురవ‌డంతో ఆయన అరెస్ట్ తప్పదని అంతా అనుకున్నారు. అయితే సుప్రీంకోర్టును మిథున్ ఆశ్ర‌యించారు. సిట్ అధికారులు స‌మ‌ర్పించిన వివ‌రాల్ని చూసి మిథున్‌రెడ్డికి వెంట‌నే సుప్రీంకోర్టు త‌దుప‌ది ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కూ అరెస్ట్ చేయొద్ద‌ని బెయిల్ మంజూరు చేసింది.

ఇదే సంద‌ర్భంలో సిట్ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో మిథున్‌రెడ్డి ఇప్ప‌టికే విచార‌ణ ఎదుర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బెయిల్ పిటిష‌న్ సుప్రీంకోర్టులో సోమ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ పిటిష‌న్‌పై జ‌స్టిస్ పార్థివాల‌, జ‌స్టిస్ మ‌హాదేవ‌న్ ధ‌ర్మాస‌నం విచారించింది.

ఇప్ప‌టికే సిట్ విచార‌ణ‌కు మిథున్‌రెడ్డి హాజ‌ర‌య్యార‌ని ధ‌ర్మాస‌నం దృష్టికి ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు అభిషేక్ సింగ్వి, నిరంజ‌న్‌రెడ్డి తీసుకెళ్లారు. సిట్ అధికారులు దాఖ‌లు చేసిన కౌంట‌ర్‌ను ప‌రిశీలించి, రిజైన్డ‌ర్ వేయ‌డానికి త‌మ‌కు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని మిథున్ త‌ర‌పు న్యాయ‌వాదులు కోరారు.

ఇందుకు న్యాయ‌స్థానం సానుకూలంగా స్పందించింది. మ‌రో రెండు వారాల‌కు కేసు విచార‌ణ‌ను వాయిదా వేస్తూ, అంత వ‌ర‌కూ మిథున్‌ను అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది. దీంతో మ‌రికొన్ని రోజులు మిథున్‌కు ఉప‌శ‌మ‌నం దొరికిన‌ట్టైంది. అయితే పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు వ‌ర‌కూ ఉత్కంఠ త‌ప్ప‌దు.

4 Replies to “మరో రెండు వారాలు మిథున్‌కు ఉపశమనం”

  1. ఈ మధ్య మింగలేక కక్కలేక అన్నట్లు ఉండే స్థితిని ఉపసమనం అంటున్నారు అన్నమాట తెలుగు లో

Comments are closed.