తిరుమ‌ల న‌డ‌క దారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌!

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోడానికి న‌డ‌క‌దారిలో వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త చెప్పింది. న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు 10 వేల టికెట్లు జారీ చేయాల‌ని టీటీడీ అధికారులు నిర్ణ‌యించారు. తిరుమ‌ల‌కు శ్రీ‌వారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా…

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోడానికి న‌డ‌క‌దారిలో వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త చెప్పింది. న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు 10 వేల టికెట్లు జారీ చేయాల‌ని టీటీడీ అధికారులు నిర్ణ‌యించారు. తిరుమ‌ల‌కు శ్రీ‌వారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా చేరుకుంటారు. ఇప్ప‌టికే శ్రీ‌వారి మెట్టు మార్గం ద్వారా న‌డిచి వెళ్లే భ‌క్తుల‌కు ప్ర‌తి రోజూ 3 వేల టికెట్ల‌ను జారీ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆ సంఖ్య‌ను పెంచ‌డం విశేషం. శ్రీ‌వారి మెట్టుమార్గంలో 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు 6 వేలు టికెట్లు జారీ చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు టికెట్ల జారీ పెంపుతో భ‌క్తుల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు టికెట్లు జారీ చేయాలనే డిమాండ్ కొన్నిరోజులుగా వినిపిస్తోంది. కూట‌మి అధికారంలోకి రావ‌డం, టీటీడీలో అధికార మార్పిడి జ‌ర‌గ‌డంతో కొన్ని సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా కొన్ని విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తుంటే, మ‌రికొన్ని నిర్ణ‌యాలు ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి.

శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోని భ‌క్తుల‌కు ఆధార్‌కు కేవ‌లం రెండు ల‌డ్లు మాత్ర‌మే ఇస్తామ‌నే టీటీడీ నిర్ణ‌యంపై వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు టికెట్ల జారీపై అభినంద‌న‌లు వ‌స్తున్నాయి.

7 Replies to “తిరుమ‌ల న‌డ‌క దారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌!”

Comments are closed.