గుడివాడ చెడుగుడు…తట్టుకోలేరంతే …

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ విపక్ష టీడీపీ మీద పదునైన మాటలతో చెడుగుడు ఆడేశారు. ఏపీలో అసలు  విపక్షం అన్నది ఉందా అని ఆయన ప్రశ్నించారు. 130…

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ విపక్ష టీడీపీ మీద పదునైన మాటలతో చెడుగుడు ఆడేశారు. ఏపీలో అసలు  విపక్షం అన్నది ఉందా అని ఆయన ప్రశ్నించారు. 130 ఏళ్ళ కాంగ్రెస్ ని అలాగే ఫార్టీ ఇయర్స్ టీడీపీని కూడా భూస్థాపితం చేసి పారేసిన పార్టీ వైసీపీ అని ఆయన ప్లీనరీ వేదికగా ప్రకటించారు.

ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయం అని కూడా జోస్యం చెప్పారు. ఈసారి విపక్షం ఆనవాళ్ళు  కూడా ఏపీలో ఎక్కడా చేసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికలో 175 సీట్లూ వైసీపీ గెలుచుకుని తీరుతుందని గుడివాడ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. దేనికీ అదరని బెదరని నాయకుడు జగన్ నాయకత్వంలో వైసీపీకి ఏ రోజుకీ  తిరుగేలేదని గుడివాడ చెబుతూ ప్లీనరీలో  చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.

ప్లీనరీ వేదికగా ఈసారి ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి పంచ్ డైలాగులు పేల్చిన వారిలో యువ మంత్రి గుడివాడ ముందు వరసలో ఉన్నారు. విపక్షం మీద ఆయన చేసిన విమర్శలు క్యాడర్ ని ఉర్రూతలూగించాయి. 

అదే విధంగా సీనియర్ మోస్ట్ నేత అయిన తమ్మినేని సీతారాం సైతం ప్లీనరీలో తన మాజీ పార్టీ టీడీపీకి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేశారు. అలాగే ఎల్లో మీడియా శల్య సారధ్యానికి కూడా ఆయన పెట్టాల్సిన చీవాట్లు పెట్టేశారు.