అచ్చొచ్చిన విశాఖలో కసి తీర్చుకోవడానికి భారత్ రెడీ!

విశాఖ భారత్ కి బాగా అచ్చొచ్చింది. అనేక రికార్డులు భారత్ కి విశాఖలోనే ఉన్నాయి. ఇక్కడ మ్యాచ్ అయితే విజయమే అన్నది స్థిరపడిపోయిన సెంటిమెంట్. అందుకే మరోసారి విశాఖ వేదికగా వీర విహారం చేయడానికి…

విశాఖ భారత్ కి బాగా అచ్చొచ్చింది. అనేక రికార్డులు భారత్ కి విశాఖలోనే ఉన్నాయి. ఇక్కడ మ్యాచ్ అయితే విజయమే అన్నది స్థిరపడిపోయిన సెంటిమెంట్. అందుకే మరోసారి విశాఖ వేదికగా వీర విహారం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇంగ్లండ్ తో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఓడిన భారత్ కసి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. దాంతో సరైన వేదికగా విశాఖ నుంచే ఇంగ్లండ్ తో తలపడనుంది.

ఫిబ్రవరి 2న భారత్ ఇంగ్లడ్ టెస్ట్ మ్యాచ్ విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్ర్కిఎట్ స్టేడియంలో జరగబోతోంది. టీం ఇండియాకు ఈ స్టేడియంలో సూపర్ రికార్డు ఉంది అని క్రికెట్ పండితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ క్రికెట్ స్టేడియంలో ఇప్పటిదాకా రెండు టెస్ట్ మ్యాచులు జరిగాయి. అయితే ఆ రెండింటిలోనూ భారత్ గెలిచి తనది విన్నింగ్ హ్యాండ్ అని రుజువు చేసుకుంది. విశాఖ అటువంటి అద్భుతమైన విజయాన్ని టీం ఇండియాకు ఇచ్చింది.

ఒకసారి అయితే సౌత్ ఆఫ్రీకాతోనే భారత్ విశాఖ వేదికగా తలపడి నిలబడి గెలిచింది. మరోసారి చూస్తే ఇంగ్లండ్ నే భారత్ ఇక్కడ ఓడించింది. ఇపుడు అదే ఇంగ్లండ్ తో తలపడబోతోంది. రిజల్ట్ ముందే తెలుసు అని క్రికెట్ అభిమానులు అంటున్నారు అంటే విశాఖ సెంటిమెంట్ ఎంతలా టీమిండియాకు కలసి వచ్చిందో చూడాలి.

అయితే గతంలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచులలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అయితే జయమ్ము నిశ్చయమ్ము అని హాట్ క్రికెట్ ఫేవరేట్స్ అంటున్నారు. జయహో భారత్ అని అపుడే విశాఖ అంటోంది. ఇప్పటికే క్రికెట్ ఫీవర్ తో విశాఖ సిటీ హోరెత్తిపోతోంది.