బాబును ఆకాశానికెత్తిన కాంగ్రెస్ నాయకుడు

ఏ పార్టీవారైనా వారి పార్టీ నాయకులను, వారి పార్టీ అధినేతని ఆకాశానికెత్తుతారు. పొగుడుతారు. లేదా తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటారు. కానీ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని…

ఏ పార్టీవారైనా వారి పార్టీ నాయకులను, వారి పార్టీ అధినేతని ఆకాశానికెత్తుతారు. పొగుడుతారు. లేదా తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటారు. కానీ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేశారు. ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ను విమర్శించారు. కానీ తన పార్టీ గురించి ఏమీ మాట్లాడలేదు. ఖమ్మంలో టీడీపీ సభ నిర్వహించడం గురించి మాట్లాడుతూ టీడీపీకి ఇప్పుడు మంచి ఎంట్రీ దొరికిందని, చంద్ర బాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటాడని జగ్గారెడ్డి అన్నారు. 

బాబు మీద ఎంత మంది మంత్రులు మొత్తుకున్నా లాభం లేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయితీ (సెంటిమెంట్)  అయి పోయిందని ఇక కేసీఆర్ ఏపీ లో సక్సెస్ కాలేడని అన్నారు. కానీ చంద్రబాబు తెలంగాణ లో సక్సెస్ అవుతాడని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ ఉన్నప్పుడు రవాణా శాఖా మంత్రిగా ఉన్న కేసీఆర్‌ చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని కేసీఆర్‌ అన్నాడని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కానీ తెలంగాణ వాదాన్ని అడ్డంపెట్టుకుని గెలిచాడని విమర్శించారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్‌ చంపేశాడని, రాష్ట్రం ఉంది కానీ వాదం పోయిందని జగ్గారెడ్డి తెలిపారు.

చంద్రబాబు మీద, టీడీపీ మీద ఎన్ని నోర్లు మొత్తుకున్నా లాభం లేదని అన్నారు. కేసీఆర్ టీడీపీకి మంచిఎంట్రీ ఇచ్చారని అన్నారు. కేసీఆర్ బీ ఆర్ ఎస్ పార్టీ పెట్టినా ఏపీలో అట్రాక్ట్ చేయలేరు.. కానీ బాబు తెలంగాణను అట్రాక్ట్ చేయగలరని అన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందన్నారు. కేసీఆర్‌లో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందన్నారు. తెలంగాణ వాదాన్ని ముఖ్యమంత్రి చంపేశారని, రాజకీయ బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారన్నారు.

చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారని, కూటములు, పొత్తులపై ముందు ముందు తెలుస్తుందని, తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని జగ్గారెడ్ది జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటకకు బీఆర్ఎస్ వెళితే టీడీపీ కూడా వెళుతుందన్నారు. బీఆర్ఎస్‌తో కేసీఆర్ సక్సస్ అయ్యే పరిస్థితి ఉండదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఏపీకి వెళుతున్నారు కాబట్టి చంద్రబాబు తెలంగాణకు వచ్చారని, సైలెంట్‌గా ఉన్న బాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశం ఇచ్చారన్నారు. 

టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారని, వారు ఇక్కడ బలపడేందుకు ఎందుకు ప్రయత్నించరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జాతీయ పార్టీ పేరుతో ఏపీలో పోటీ చేస్తుంటే, టీడీపీ కూడా ఇక్కడ బలపడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లనే తెలంగాణలో ఈ పరిస్థితి తలెత్తిందని, చంద్రబాబును ఇక తప్పుపట్టడానికి ఏముందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇంట చెప్పిన జగ్గా రెడ్డి కాంగ్రెస్ తెలంగాణలో బలపడటం గురించి ఏమీ చెప్పలేదు. దాని పని అయిపొయింది కాబట్టి మాట్లాడటం అనవసరం అనుకుంటున్నారా?