కూట‌మి ఉమ్మ‌డి మేనిఫెస్టో విడుద‌ల తేదీ ఖ‌రారు!

టీడీపీ, జ‌న‌సేన కూట‌మి మేనిఫెస్టోపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. చాలా రోజుల క్రితం మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నారా లోకేశ్ ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ అది ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేదు. టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ…

టీడీపీ, జ‌న‌సేన కూట‌మి మేనిఫెస్టోపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. చాలా రోజుల క్రితం మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నారా లోకేశ్ ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ అది ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేదు. టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ , ఎందుక‌నో వాటిపై పెద్ద‌గా ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. అవేవో ఆయ‌నే మ‌రిచిపోయారు.

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాన్ ఇద్ద‌రు నాయ‌కులు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆవే త‌మ‌కు ఓట్లు రాల్చుతాయ‌ని ఆ ఇద్ద‌రు నాయ‌కులు అనుకుంటున్నారు. మ‌రో వైపు జ‌గ‌న్ మాత్రం ఐదేళ్లుగా అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రిస్తున్నారు. అలాగే అభివృద్ధి ప‌నుల‌పై మాట్లాడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి మేనిఫెస్టోపై అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిలో టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న చిల‌క‌లూరిపేట‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో ఉమ్మ‌డి మేనిఫెస్టోను విడుద‌ల చేస్తామ‌న్నారు. ఈ బ‌హిరంగ స‌భ ద్వారా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

ఈ స‌భ‌కు ఆర్టీసీ బ‌స్సులు ఇవ్వ‌క‌పోతే ఎండీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌ని అచ్చెన్నాయుడు హెచ్చ‌రించారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ చిల‌క‌లూరిపేట స‌భ కొత్త చ‌రిత్ర‌ను సృష్టిస్తుంద‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాత్రికి ఢిల్లీ చేరుకుంటార‌ని ఆయ‌న చెప్పారు.