పిచ్చోడా …జ‌గ‌న్ స్థాయి ఇదీ!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను నువ్వెంత‌? నీ బ‌తుకెంత‌? నీ స్థాయి ఎంత‌? అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డంపై మంత్రి జోగి ర‌మేశ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఐదు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను నువ్వెంత‌? నీ బ‌తుకెంత‌? నీ స్థాయి ఎంత‌? అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డంపై మంత్రి జోగి ర‌మేశ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఐదు కోట్ల మంది తెలుగు ప్ర‌జ‌ల్ని అడిగితే జ‌గ‌న్ స్థాయి ఏంటో చెబుతార‌ని ఆయ‌న అన్నారు. భార‌తదేశం మొత్త‌మంతా జ‌గ‌న్ స్థాయి గురించి చెబుతుంద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా గౌర‌వ‌ప్ర‌ద‌మైన వ్య‌క్తులంతా జ‌గ‌న్ స్థాయి గురించి చెబుతార‌న్నారు.

కానీ ఈ పిచ్చోడు మాత్రం ద‌మ్మున్న‌ జ‌గన్‌ను ప‌ట్టుకుని నీ స్థాయి, బ‌తుకెంత అని ప్ర‌శ్నిస్తున్నాడ‌ని జోగి ర‌మేశ్ త‌ప్పు ప‌ట్టారు. అస‌లు నీ బ‌తుకేంట్రా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు నీ కెపాసిటీ, బ‌తుకు ఏంటో చెప్పాల‌ని చంద్ర‌బాబు పెంపుడు కుక్క అయిన ప‌వ‌న్‌ను అడుగుతున్నాన‌ని జోగి ర‌మేశ్ తెలిపారు. ఒంటిచేత్తో పార్టీని స్థాపించిన స్థాయి జ‌గ‌న్‌ది అని ఆయ‌న అన్నారు. 2011లో పార్టీని స్థాపించి క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేస్తే దేశ ప్ర‌జ‌లంతా అటు వైపు చూశార‌న్నారు.

క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానం నుంచి ఐదు ల‌క్ష‌ల‌కు పైగా మెజార్టీతో గెలుపొంది ఒక మైలురాయిగా నిలిచార‌న్నారు. ఆ త‌ర్వాత ఒక్క‌డిగా మొద‌లైన ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా 67 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నార‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో 175కు 151 ఎమ్మెల్యేలు, 25కు 22 లోక్‌స‌భ స్థానాల్లో వైసీపీని గెలిపించి చ‌రిత్ర పుట‌ల్లో త‌న పేరును లిఖించుకున్నాడ‌ని జోగి ర‌మేశ్ తెలిపారు.

దేశ‌మంతా జ‌గ‌న్ మాదిరిగా వుండాల‌ని చెప్పుకునేలా రికార్డును తిర‌గ‌రాశార‌న్నారు. అదీ జ‌గ‌న్ స్థాయి అంటూ ప‌వ‌న్‌కు జోగి ర‌మేశ్ చెప్పారు. ప‌వ‌న్ రాజ‌కీయ చ‌రిత్ర ఏంటో తెలుసుకోవాల‌న్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ అనుబంధమైన యువ‌రాజ్యం అధ్యక్షుడిగా ప‌వ‌న్ త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పారిపోయిన చ‌రిత్ర అంటూ దెప్పి పొడిచారు. 2014లో మ‌ళ్లీ జ‌న‌సేన‌ను స్థాపించి ఆ ఎన్నిక‌ల్లో పార్టీని చంద్ర‌బాబుకు హోల్‌సేల్‌గా అమ్మేసిన పాలేరు నువ్వు అని ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప్యాకేజీకి అమ్ముడుపోయే ప‌వ‌న్ త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డ‌మా? అని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. పిచ్చోడా జ‌గ‌న్ స్థాయి గురించి మాట్లాడే స్థాయా నీది అంటూ నిల‌దీశారు. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డం అంటే సినిమా అనుకున్నావా? అని ఆయ‌న నిల‌దీశారు.

చంద్ర‌బాబు ద‌గ్గ‌రికెళ్లి ములాఖ‌త్ తీసుకుని మిలాఖ‌త్ అయిపోయాడ‌ని విమ‌ర్శించారు. అస‌లు నీకు విలువ‌లు, సిద్ధాంతం, ఆశ‌యం క‌నీసం ఒక్క శాత‌మైనా ఉన్నాయా అని మంత్రి ప్ర‌శ్నించారు. 2019కి వ‌చ్చే స‌రికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనే వ్య‌క్తి పెద్ద ఎద‌వ అని, ఇత‌ని వ‌ల్ల తాము గెల‌వ‌డం ఏంట‌ని చంద్ర‌బాబు, లోకేశ్ తిట్ట‌ని తిట్టకుండా తిట్టి, కుటుంబ స‌భ్యుల్ని అవ‌మానించి బ‌యటికి నెట్టేసిన విష‌యాన్ని ప‌వ‌న్‌కు గుర్తు చేశారు.

నాడు చంద్ర‌బాబు, లోకేశ్‌లు అవినీతిప‌రుల‌ని విమ‌ర్శించ‌డాన్ని ప‌వ‌న్‌కు ఆయ‌న జ్ఞ‌ప్తికి తెచ్చారు. ప్ర‌జాధ‌నాన్ని చంద్ర‌బాబునాయుడు లూటీ చేశాడ‌ని విమ‌ర్శించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నేడు ఆయ‌న సంక నాక‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని తూర్పార‌ప‌ట్టారు. నువ్వుపోయి బాబు సంక నాకుతావ‌ని జ‌న‌సైనికుల‌కు ఏం తెలుస‌ని మంత్రి సానుభూతి వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ నిజ స్వ‌రూపాన్ని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తెలుసుకోవాల‌ని ఆయ‌న కోరారు.