ఎమ్మెల్యే ఇంట్లో విషాదం!

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి…

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌ 101వ నంబరు ఫ్లాటులో ఆయన శవమై కనిపించారు. 

మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ కుంచనపల్లిలోని నివాసానికి వస్తుంటారని వెల్లడైంది. మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం విగతజీవిగా కనిపించారు. మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.

పీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కుమారుడి మృతి వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. 

మంజునాథరెడ్డి ఆత్మహత్యపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.