ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని సినీ కవి చాలా రమ్యంగా చెప్పి ఉండవచ్చు గాక. కానీ అనుభవంలో గమనిస్తే.. రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలే వేరులే అని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కేవలం రాజకీయ నాయకుడుగా ఉన్న దశ నుంచి ప్రమోట్ అయి.. చట్టసభల ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఒక నాయకుడు.. తన చుట్టూ సంకుచితమైన గిరిగీసుకుని మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాటలు గమనిస్తే అలాగే అనిపిస్తోంది.
తన అన్నయ్య కేశినేని నానితో ఆయనకు వైరం ఉన్నది గనుక.. అన్న హఠాత్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయి అక్కడ టికెట్ దక్కించుకుని, విజయవాడ ఎంపీ బరిలో తనతోనే తలపడిన శత్రువు గనుక.. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో తన ప్రాథమిక విధి అని కేశినేని చిన్ని భావిస్తున్నట్టుగా ఉంది తప్ప.. ఆయన వాదనల్లో లాజిక్ లేదని పలువురు భావిస్తున్నారు. పైగా.. నాయకుల మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా.. జగన్ మీద విమర్శలు కురిపిస్తూ ఆయన ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి.. కొందరి ప్రయోజనాల కోసమేనేమో అన్నట్టుగా అనుమానాలు పుట్టిస్తోంది.
ఎన్నారైలకు చెందిన కంపెనీ ఉర్సాకు డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో విశాఖలో వేల కోట్లరూపాయల విలువైన భూమిని ఎకరా 99 పైసల వంతున లీజుకు ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా పెద్ద సంచలనాంశం అవుతోంది. ఈ విషయాన్ని సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అయిన వారికి దోచిపెట్టడానికేనా కూటమి అధికారంలోకి వచ్చింది.. అని నిలదీస్తోంది.
విశాఖపట్నంలో జరుగుతున్న ఈ భూపందేరానికి సంబంధించిన విజయవాడలో కూడా రాజుకుంది. అక్కడ మాజీ ఎంపీ కేశినేని నాని దీనిపై విమర్శలు చేస్తుండగా.. ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి కేశినేని చిన్ని రెచ్చిపోతున్నారు.
‘‘పెట్టుబడులు పెట్టే ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నారు. వారికి మేం అండగా ఉంటాం. నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రవాసాంధ్రులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదు. రాజధాని అమరావతికి నిఝధులు రాకుండా జగన్ బ్యాచ్ ప్రయత్నిస్తోంది.. రాష్ట్రానికి, యువతకు నష్టం చేసే పనుల్ని ఆ పార్టీ మానుకోవాలి..’’ అని కేశినేని చిన్ని రెచ్చిపోతున్నారు.
ఈ ప్రకటన చూస్తే.. చిన్ని తనను తాను.. ప్రవాసాంధ్రుల తరఫున ఏపీలో పనిచేయడానికి ఎన్నికైన ఎంపీయేమో అనే అనుమానం కలగకమానదు. ఒక ప్రజానాయకుడిగా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వచ్చినా తాము అండగా ఉంటాం అని చెప్పాలే తప్ప.. ప్రవాసాంధ్రుల భజన చేస్తూ ఈ విషయంలో విమర్శలు చేయడం వల్ల ఆయన ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికే ఇదంతా మాట్లాడుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది.
ఎన్నారైలను ప్రసన్నం చేసుకోవడానికి సాధారణంగా నాయకులు ఎగబడుతుంటారు. చిన్ని ప్రయత్నాలు కూడా అలాగే ఉన్నాయి. ఉర్సా అనే సంస్థ పెట్టుబడులతో రావొచ్చు గాక.. ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు గాక.. కానీ.. ఒక ఎకరా భూమిని 99 పైసలకు ఎలా అద్దెకిస్తారు.. అనే ఔచిత్యం ఈ నాయకుడికి ఉండాలి కదా అని ప్రజలు అనుకుంటున్నారు.
Manam cheyam chesey valla midha padi edustham
1 rs kakapothe free ga istharu niku enti problem… Mee regime lo NRI lera…vallu invest chehara…miku chethakaledhu 1rs ivvadam…mem icham
First of all stop writing lies, only tcs got for 99 pies. They already told ursa got for 1 cr acre. When you lie you die.
పార్టీ కంటే నువ్వే గొప్ప అని విర్రవీగిన నానీగా , అదే పార్టీ టికెట్ తో నీ తమ్ముడు నీమీదే లక్షల మెజారిటీ తో నిన్ను చిత్తు చిత్తు గా ఓడించి ఎంపీ అయితే ఓర్చుకోలేకున్నావ్.. అసూయ తో కుట్రలు చేస్తున్నావ్.. ఏం అన్నవి రా నువ్వు తూ..
నాయకుడికి ఉండాల్సిన లక్షణాలులేవు, కనీసం ఫ్యామిలీ పెద్దగా ఉండాల్సిన విచక్షణ, గౌరవ మర్యాదలు కూడా లేకుండా చేసుకున్నావ్
బెటర్ ‘సచ్చిపోరా
99 paisa kadu ra 1 cr ki 3 acrs remaining land 50-60 lakh around ele fake news rayatam avasramaa..ayana nuvu a panikimalina vedavani ennalu support chestavu vadu malla CM avvaledu..
వైసీపీ లో ఉన్న దౌర్భాగ్యం ఇదే..
మీ ఆరోపణల్లో నిజం ఉండదు.. దానివల్ల అక్కడ అవినీతి జరిగినా మీ రాతల వల్ల జనాలు మిమ్మల్ని నమ్మడం మానేశారు..
ఉర్సా కంపెనీ కి ఎకరా కి 99 పైసలకి ఇచ్చారనేది అబద్ధం..
టీసీఎస్ కి ఇచ్చారు.. అలా ప్రతి కంపెనీ కి ఇవ్వరు..
మీ అబద్ధాల వల్ల మీ ఆరోపణలకు విలువ లేకుండా పోతోంది.. అది వైసీపీ కే బూమరాంగ్ అవుతోంది..
ఆలోచించుకోండి..
కానీ. U. L. S. A అనేది అసలు ఊరు పేరు.లేని కంపెనీ అని దానికి క్లౌడ్ establishment lo ఎలాంటి అనుభవం లేదని కంపెనీ ప్రైమ్ క్యాపిటల్ కనీసం 50 కోట్లు లేవు అని అలాంటి కంపెనీల కి ఎకరాల భూములు తక్కువ రేట్ కు ఎలా ఇస్తారు .T C S ku ఇవ్వడాన్ని thappu బట్టడం ledhu manchi నిర్ణయం కానీ U L S A మీద ఆరోపణలు నిజంగా అనిపిస్తున్నాయి
rendu nellao puttina vooru peru leni company ki 60 ekaraalu ivvadam entra .
meeru kotiki ichharu ante … adi vanda kotlu vuntundi land value .
emana ante US company ni thechharu .. adi anna sakka vundi ante adi kooda 4 nelala kritham modalina company … inka chaala vunnaei ila .. anni bayataki vasthaei ..
ekkuva voogipomaku
Mahdyam. లొ. వేల కోట్లు ఎలా చేతులు maaraayoo. వేల కోట్ల అవినీతి ఎలా జరిగింది అందరికి తెలుసు కనీసం వారి మీద వివరణాత్మక ఆర్టికల్ మీ వెబ్ సైట్ లో రావడం లేదు అదేం విడ్డూరం . U L S A మీద ఆర్టికల్ రాయడం తప్పు లేదు . ఊరు పేరు లేని కంపెనీ లకు ఇలా వైజాగ్ లో విలువైన భూములు ఎందుకు ఇవ్వాలి .అనేది ప్రశ్న
నా దగ్గర axis bank account లో 10k ఉంది.. account క్లోజ్ చేసి వైజాగ్ లో ఒక పదివేల ఎకరాలు కొందాం అనుకుంటున్నా.. రూపాయి ఎక్కువైన పర్లేదు అడ్జస్ట్ చేస్తా.. మాంచి పార్టీ ఉంటే చెప్పండి.. కొనేద్దాం