శ‌భాష్ లోకేశ్ పీఆర్ టీమ్‌!

రాజ‌కీయాల్లో ప‌బ్లిక్ రిలేష‌న్స్ (పీఆర్‌) టీమ్ ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఒక నాయ‌కుడిని పాల‌ముంచాల‌న్నా, నీళ్ల‌లో ముంచాల‌న్నా ఆ టీమ్ కీల‌క పాత్ర పోషిస్తుంది. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో గ‌మ‌నిస్తూ, ఎప్ప‌టిక‌ప్పుడూ త‌మ నాయ‌కుల‌కు…

రాజ‌కీయాల్లో ప‌బ్లిక్ రిలేష‌న్స్ (పీఆర్‌) టీమ్ ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఒక నాయ‌కుడిని పాల‌ముంచాల‌న్నా, నీళ్ల‌లో ముంచాల‌న్నా ఆ టీమ్ కీల‌క పాత్ర పోషిస్తుంది. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో గ‌మ‌నిస్తూ, ఎప్ప‌టిక‌ప్పుడూ త‌మ నాయ‌కుల‌కు చేర‌వేస్తూ, అప్ర‌మ‌త్తం చేయ‌డం పీఆర్ టీమ్ ప్ర‌ధాన ఉద్దేశం. ఈ విష‌యంలో మంత్రి నారా లోకేశ్ అదృష్ట‌వంతుడు. విష‌య ప‌రిజ్ఞానం, మీడియాతో స్నేహ పూర్వ‌క సంబంధాల్ని నెర‌వేర్చ‌గ‌లిగే స‌మ‌ర్థులైన పీఆర్ టీమ్‌ను నియ‌మించుకున్నారు.

అందుకే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ ఎప్ప‌టిక‌ప్పుడు లోపాల్ని స‌వ‌రించుకుంటూ ముందుకెళ్ల‌గ‌లుగుతున్నారు. తాజాగా డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై ఈ నెల 27న “గ్రేట్ ఆంధ్ర‌”లో “ప్ర‌భుత్వ అనాలోచితం…డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు తిప్ప‌లు!” అనే శీర్షిక‌తో క‌థ‌నం వెలువ‌డింది. ల‌క్ష‌లాది మంది డీఎస్సీ అభ్య‌ర్థుల‌ను దృష్టిలో పెట్టుకుని స‌ద్విమ‌ర్శ‌తో రాసిన క‌థ‌నాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి ఆయ‌న పీఆర్ టీమ్ తీసుకెళ్లింది. ఆ క‌థ‌నంలో ప్ర‌ధాన అంశాలేంటో మ‌రో సారి తెలుసుకుందాం.

“డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశముంది. ఎంతమంది దరఖాస్తు చేసినా ఉద్యోగాలు వచ్చేది 16,347 మందికి మాత్రమే. అలాంటప్పుడు దరఖాస్తు చేసే ఆరు లక్షల మంది తమ సర్టిఫికెట్లను అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం ఏముంది? డీఎస్సీ ముగిసిన తరువాత క్వాలిఫై అయిన వారిని తమ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయమంటే సరిపోతుంది. అలా కాకుండా దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలనే నిబంధన పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

దరఖాస్తు సమయంలో కేవలం వివరాలు మాత్రమే నమోదు చేయమంటే సరిపోయేది. పోస్టింగ్‌ ఇచ్చేటప్పుడు ఎటూ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అప్పటిలోపు సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోమని చెబితే సరిపోయేది. అలాకాకుండా దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయమని చెప్పడంతో…. ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ల కోసం హైరానా పడాల్సి వస్తోంది” అని రెండు రోజుల క్రితం “గ్రేట్ ఆంధ్ర” క‌థ‌నం రాసింది. అంతేకాదు, డీఎస్సీ అభ్య‌ర్థుల స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే మంత్రి లోకేశ్ స్పందించి, సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని అందులో కోరడం, అందుకు త‌గ్గ‌ట్టుగా ఆయ‌న స్పందించ‌డం విశేషం.

క‌థ‌నంలో పేర్కొన్న అంశాలు స‌హేతుకంగా ఉన్నాయ‌ని మంత్రి భావించారు. అందుకే డీఎస్సీ అభ్య‌ర్థుల ఇబ్బందుల‌ను తొల‌గిస్తూ కీల‌క నిర్ణ‌యాన్ని లోకేశ్ వెలువ‌రించ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. స‌ర్టిఫికెట్ల అప్‌లోడ్‌లో ఇబ్బందులు ఆయ‌న నిర్ణ‌యంతో తొల‌గ‌నున్నాయి.

డీఎస్సీ అభ్య‌ర్థులను ఉద్దేశించి ఎక్స్‌లో ఆయ‌న ట్వీట్ చేశారు. అందులో ఆయ‌న ఏమ‌న్నారో చూద్దాం.

దరఖాస్తు చేసే సమయంలో పార్ట్‌ 2 విభాగంలో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయడం కేవలం ఆప్షనల్ మాత్రమేనని మంత్రి లోకేశ్ స్ప‌ష్టం చేయ‌డం విశేషం. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం ఖ‌చ్చితంగా ఒరిజినల్ పత్రాలు సమర్పించాలని ఆయ‌న తెలిపారు. దీంతో అభ్యర్ధులకు బిగ్‌ రిలీఫ్‌ లభించినట్లైంది. క్షేత్ర‌స్థాయిలో డీఎస్సీ అభ్య‌ర్థుల ఇబ్బందుల‌పై క‌థ‌నం రావ‌డం, దాన్ని వెంట‌నే మంత్రి దృష్టికి తీసుకెళ్లి ల‌క్ష‌లాది మందికి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డంలో ఆయ‌న పీఆర్ టీమ్ ప్ర‌శంస‌నీయ పాత్ర పోషించింది. దీన్నిబ‌ట్టి లోకేశ్ బ‌లం పీఆర్ టీమ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

19 Replies to “శ‌భాష్ లోకేశ్ పీఆర్ టీమ్‌!”

  1. నువ్వు చెప్పడం వల్లే జరిగింది అంటున్నావు, మరి ఇలా జగన్ కి చెప్పలేదా వెధవ 

  2. ఎంకీ, దీన్ని బట్టి ja*** గాడి PR టీమ్ worst అనమాట!! నువ్వెందుకు ఒప్పుకుంటావ్, నువ్వు కూడా ఆ టీమ్ సభ్యుడే కదా!! అందరూ కలిసి వాడ్ని బఫూన్, spyder సైకో, మాడా గాడిలా ప్రాజెక్ట్ చేశారు కదరా దుర్మార్గుల్లారా!! 

  3. అన్నియ్య PR టీం అంతా ఎక్కడా దోచుకుతిందామా అనే ఆలోచనే తప్ప పరిపాలన ఎలా ఉందనే అనే సోయి ఒక్కడికన్నా ఉందా? అఫ్ కోర్స్ అన్నియ్యకి కూడా అదే కావాలనుకో

  4. సర్టిఫికెట్లు అప్లోడ్ చెయ్యడానికి ఇబ్బంది ఏముంటుంది? అంటే డిగ్రీ పాస్ కాకపోయినా dsc పరీక్షలు రాస్తారా?

  5. Chivariki elago icchedi iTDP vallaki maatrame. daaniki intha racha enduku. congrats ra iTDP gang. Meeku 16000 vudhyogaalu ready. Bengal lo choostunnam kada emayindo. ikkada same to same.

  6. అంటే మిగతా రాజకీయ నాయకులకు PR టీం ఉంటారు..

    అన్నియ కి మాత్రం కోటరీ ఉంటది..

    ఆ కోటరీ పాల బుగ్గల పసి బాలుడైన అన్నియ ని అమాయకుడిని చేసి ముంచేస్తుంది..

    అన్నియ తప్పేం లేదు అని అర్ధం కదా ఎంకి

Comments are closed.