ఆ 45 నిమిషాలు థియేటర్ ఊగిపోతుందట

మహేష్ ప్రతి సినిమాలో ఓ సూపర్ హిట్ బ్లాక్ ఉంటుంది. మహర్షి, భరత్ అనే నేను, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో కొన్ని బ్లాక్స్ బాగా క్లిక్ అవుతాయి.…

మహేష్ ప్రతి సినిమాలో ఓ సూపర్ హిట్ బ్లాక్ ఉంటుంది. మహర్షి, భరత్ అనే నేను, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో కొన్ని బ్లాక్స్ బాగా క్లిక్ అవుతాయి. అలాంటి ఓ బ్లాక్, సర్కారువారి పాటలో కూడా ఉందంటున్నాడు మహేష్. ఈసారి 10-15 నిమిషాలు కాకుండా.. ఏకంగా 45 నిమిషాల పాటు ఉంటుందని చెబుతున్నాడు.

“ఫస్టాఫ్ లో అద్భుతమైన ట్రాక్ ఒకటి ఉంది. 45 నిమిషాల పాటు థియేటర్ ఊగిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. పరశురామ్ ఆ ఎపిసోడ్ ను చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈమధ్య కాలంలో నేను బాగా ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ అది. నా టైమింగ్ బాగా కుదిరింది. ఆడియన్స్ అయితే ఊగిపోవడం గ్యారెంటీ. ఈమధ్య 7-8 ఏళ్లలో నేను ఇలాంటి సీన్లు చేయలేదు. నా క్యారెక్టర్ ఫ్రెష్ గా అనిపించడానికి, ట్రయిలర్ క్లిక్ అవ్వడానికి ఆ 45 నిమిషాలే బ్లాకే కారణం.”

ఇలా సర్కారువారి పాట సినిమాపై అంచనాలు పెంచేశాడు మహేష్. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటపెట్టాడు. ట్రయిలర్ లో ఆర్కే బీచ్ లో నిల్చొని మహేష్ డైలాగ్ చెప్పే సన్నివేశం, ఫైట్ చేసే సీన్ ఉన్నాయి. అవన్నీ సెట్ లో చేసిన విషయాన్ని బయటపెట్టాడు.

“వైజాగ్ ఆర్కే బీచ్ లో ఓ బ్లాక్ ఉంది. అక్కడకు వెళ్లి షూట్ చేయడం అసాధ్యం. జనాలు వచ్చి మీద పడిపోయారు. దీంతో రామోజీ ఫిలింసిటీలో ఆర్కే బీచ్ సెట్ వేశాం. అత్యంత సహజంగా కనిపించేలా గ్రాఫిక్స్ పెట్టాం. ఆ క్రెడిట్ మొత్తం గ్రాఫిక్స్ టీమ్ కు ఇవ్వాలి. సినిమాలో ఆ ఎపిసోడ్ చూస్తే సెట్, గ్రాఫిక్స్ అని ఎవ్వరూ అనుకోరు.”

ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తన ఆహారపు అలవాట్లను కూడా బయటపెట్టాడు మహేష్. పేస్ట్రీలు, బర్గర్ లు, పెరుగున్నం అస్సలు తిననని ప్రకటించాడు. అవి మానేసి దాదాపు పదేళ్లు అవుతుందట. పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్స్ కు వెళ్లినప్పుడు మాత్రం చాలా అరుదుగా బర్గర్లు, పేస్ట్రీలు తింటానని చెప్పుకొచ్చాడు.