నా ప్ర‌యాణం జ‌గ‌న్ వెంటేః వైసీపీ ఎంపీ

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీని వీడ‌డంపై విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రేమో ఖండిస్తుండ‌గా, మ‌రికొందరు మాత్రం మౌనంతో అంగీకారం తెలుపుతున్నారు. పార్టీని వీడుతార‌నే ప్ర‌చారంపై విజ‌య‌సాయిరెడ్డి ఖండించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రో…

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీని వీడ‌డంపై విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రేమో ఖండిస్తుండ‌గా, మ‌రికొందరు మాత్రం మౌనంతో అంగీకారం తెలుపుతున్నారు. పార్టీని వీడుతార‌నే ప్ర‌చారంపై విజ‌య‌సాయిరెడ్డి ఖండించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రో ఎంపీ మేడా ర‌ఘునాథ‌రెడ్డి స్పందించారు.

తాను పార్టీని వీడ‌డం లేద‌ని ర‌ఘునాథ్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే…

“నా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. దుష్ప్ర‌చారం వెనుక ఏదో కుట్ర వుంది. నేను ఎప్ప‌టికీ వైసీపీని వీడేది లేదు. వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోనే ప‌ని చేస్తాను. రాజ‌కీయాల్లో ఉన్నంత వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్‌తోనే నా ప్ర‌యాణం. ఫేక్ ప్ర‌చారాన్ని ఎవ‌రూ న‌మ్మ‌కండి” అని ఆయ‌న కామెంట్ చేశారు.

దీంతో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఊపిరి పీల్చుకున్నారు. ఏ రాజ్య‌స‌భ స‌భ్యుడు పార్టీ వీడుతారో అనే భ‌యాందోళ‌న వైసీపీని వెంటాడుతోంది. మేడా ర‌ఘునాథ్‌రెడ్డి సోద‌రుడు మ‌ల్లిఖార్జున్‌రెడ్డి ఇప్ప‌టికే పార్టీని వీడి టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న టీడీపీ గెలుపు కోసం ప‌ని చేశారు. అందుకే మేడా ర‌ఘునాథ్‌రెడ్డిపై అనుమానం. కానీ ఆయ‌న మాత్రం జ‌గ‌న్ వెంట‌నే త‌న ప్ర‌యాణం అని తేల్చి చెప్ప‌డం వైసీపీకి ఊర‌ట‌నిచ్చే సంగ‌తి.

12 Replies to “నా ప్ర‌యాణం జ‌గ‌న్ వెంటేః వైసీపీ ఎంపీ”

Comments are closed.