ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రాజకీయ విధానాలు మారినప్పుడల్లా ప్రధాని మోదీపై ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంటుంది. ప్రధాని మోదీ మరోసారి ప్రధాని అయితే ఈ దేశం నుంచి ముస్లింలను వెళ్లగొడతారని సంచలన హెచ్చరిక చేసిందెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఆ వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2024లో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. దీంతో గతంలో మోదీ గురించి చేసిన తీవ్ర విమర్శల్ని తూచ్ అంటున్నారు. కానీ జనాలు అన్నీ గుర్తు పెట్టుకుంటారన్న సంగతిని మరిచినట్టున్నారు.
ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును మోదీ సర్కార్ తీసుకొచ్చింది. ఈ బిల్లుపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిత్యం దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం జేఏసీ పిలుపు మేరకు కడపలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆదివారం లాంగ్మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. భారీ ఎత్తున ముస్లింలు ర్యాలీకి వెళ్లారు.
ఇదే సందర్భంలో టీడీపీ నాయకుడు అమీర్బాబు కూడా ర్యాలీకి మద్దతుగా వెళ్లారు. కానీ ముస్లింలు ఆయన్ను అనుమతించకనపోవడం గమనార్హం. బిల్లు ఆమోదానికి పార్లమెంట్లో మద్దతు తెలిపి, ఇప్పుడు ఆ పార్టీ ప్రతినిధిగా ర్యాలీలో ఏ మొహం పెట్టుకుని వచ్చారని నిర్వాహకులు నిలదీశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల మనోభావాల్ని గౌరవించి, టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేసిన తర్వాతే రావాలని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక అమీర్బాబు అక్కడి నుంచి వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ఘటనతో ముస్లింలలో ఎంత వ్యతిరేకత వుందో సీఎం చంద్రబాబు అర్థం చేసుకోవచ్చు.
చిలకలూరిపేట లో విడుదల రజనీని కూడా ముస్లిమ్ లు పొమ్మన్నారు వాళ్ళ ర్యాలీ నుండి
Whats wrong in the bill?. In hyderabad itself many lands were looted in the name of this, hospitals, hotels were built. Temple lands also need to be protected from all parties in AP & Telangana. From small to big temples in the hands of politicians and theirgoons.
GA GARU G MUSUKINIVUNTE MANCHIDI
Ippudu emantav great andhra.bill pettoddantav.nee lantollu vundabatte desam ila ayindi.
Cheee wrong fellow u inform wrote information
anna vasthada rally ki ?