భారత్ తో మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది పాకిస్థాన్. యుద్ధం వస్తే గట్టిగా సమాధానం చెబుతామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పాక్ నేతల ప్రేలాపనల్ని కాసేపు పక్కన పెడదాం. అసలు పాకిస్థాన్ లో సగటు మానవుడు, మధ్యతరగతి పౌరుడు ఏమనుకుంటున్నాడు. దీనిపై ఆసక్తికర సర్వే చేసింది న్యూయార్క్ టైమ్స్.
“యుద్ధంలో భారత్ పై గెలుపు కావాలా.. లీటర్ పాలు సరసమైన ధరకు కావాలా?” ఈ సింపుల్ ప్రశ్నకు పాలు మాత్రమే కావాలనే సమాధానం దాదాపు 80 శాతం ప్రజల నుంచి వచ్చిందంటోంది ఆ అంతర్జాతీయ మీడియా సంస్థ.
నిజమే, పాకిస్థాన్ లో ఎవరైనా ఇప్పుడు పాలు లాంటి నిత్యావసరాల్ని మాత్రమే కోరుకుంటారు. ఎందుకంటే, ఆ దేశంలో ద్రవ్యోల్బణం పీక్ స్టేజ్ కు చేరింది. గడిచిన కొన్నేళ్లుగా పాక్ లో నిత్యావసరాల ధరలు ఏటా 30 శాతం చొప్పున పెరిగిపోతున్నాయి. ఆ దేశంలో మధ్యతరగతి కుటుంబ పోషణ భారంగా మారింది.
ఒకప్పుడు గోధుమల కోసం కొట్టుకున్న పాకిస్థాన్ ప్రజలు, ఇప్పుడు దాదాపు ప్రతి నిత్యావసరం కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి. పాకిస్థాన్ కరెన్సీలో చూసుకుంటే, అక్కడ కిలో చికెన్ దాదాపు 800 రూపాయలు. డజను గుడ్లు 330 రూపాయలు. లీటరు పాలు 224 రూపాయలు. చివరికి రొట్టె కూడా 160 రూపాయలైంది. పాక్ లో రోజూ తినే టమాట, బంగాళాదుంపలు కూడా వంద రూపాయలు దాటేశాయి.
ఇలా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న టైమ్ లో పాకిస్థాన్ లోని యూనివర్సిటీలు, లివింగ్ రూమ్స్, కేఫ్స్ లో సరిహద్దులో యుద్ధం గురించి చర్చ తక్కువగా జరుగుతోందని ప్రకటించింది న్యూయార్క్ టైమ్స్. పాక్ లో సామాన్య పౌరులు పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని గమనించింది. ప్రజల ఆలోచన విధానానికి, ప్రభుత్వ వ్యవహారశైలికి అస్సలు పొంతన లేదనే విషయాన్ని బయటపెట్టింది.
గతంలో భారత్ తో యుద్ధాలు జరిగినప్పుడు పాకిస్థాన్ ప్రజల భావోద్వేగం యుద్ధం మాత్రమే. కానీ ఇప్పుడా ఎమోషన్ వాళ్లలో కనిపించడం లేదు, భవిష్యత్తుపై ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ యుద్ధాన్ని కోరుకోవడం వెనక మరో కారణాన్ని కూడా అంచనా వేస్తోంది అంతర్జాతీయ మీడియా.
యుద్ధాన్ని సాకుగా చూపి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి మరింత ఆర్థిక సహకారాన్ని పొందడానికి పాక్ ప్రయత్నిస్తుందని, ఇప్పటికే తీసుకున్న అప్పుల్ని మాఫీ చేయించుకునేందుకు యుద్ధాన్ని ఓ సాకుగా వాడుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఇవన్నీ పక్కనపెడితే, ఉన్నఫలంగా యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? భారత్ తో పాకిస్థాన్ ఎన్నాళ్లు పోరాడగలదు? ఉక్రెయిన్-రష్యా యుద్ధంలా ఇది ఏళ్ల తరబడి కొనసాగుతుందా? దీనిపై కొంతమంది నిపుణులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. నిజంగా యుద్ధం వస్తే, పాకిస్థాన్ 4 రోజులకు మించి యుద్ధరంగంలో నిలబడలేదని చెబుతున్నారు. డబ్బుల కోసం తన దగ్గరున్న చాలా ఆయుధాల్ని రెండేళ్ల కిందట ఉక్రెయిన్ కు అమ్మేసింది పాక్. మరీ ముఖ్యంగా కీలకమైన 155ఎంఎం షెల్స్ ను ఉక్రెయిన్ కు అమ్మేయడంతో, పాక్ వద్ద ఆ నిల్వలు తగ్గిపోయాయి. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు అందుబాటులో ఉన్నప్పటికీ షెల్స్ లేనప్పుడు యుద్ధం ఎలా?
The script is from China… It’s better India stays calm ( I mean no war but only few diplomatic tightening will suffice). Pak has got nothing to lose but India is seeing some good progress in last 3 decades or so. A war can take us back to 60s poverty.
Only sensible comment in the rent years. I guess you are not a spin off product of btech colleges.
Only thootalena gottalu Leva valla daggara ???
అబ్బా ఎన్ని రోజులకు యుద్ధం గురుంచి రాసావు భారత్ కి మద్దతు గా.. ఎపుడు జగ్గూ, వైసీపీ భజన. టీడీపీ, జనసేన మీద ఏడుపులే అనకున్నా..
As per reports receiving, Center will announce India is “Hindu Rashtra” in due course in the name of Pahalgam attack. fingers crossed.