బ‌ట్ట‌లూడ‌దీసి చూడాల‌నే కోరిక ఉంటే…మేమొస్తాం!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే వైసీపీ నేత‌ల బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తాన‌ని హెచ్చ‌రించ‌డంపై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తా, తోలు…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే వైసీపీ నేత‌ల బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తాన‌ని హెచ్చ‌రించ‌డంపై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తా, తోలు తీస్తా, తాట తీస్తానని హెచ్చ‌రిస్తున్నాడ‌ని. ఇది ప‌ద్ధ‌తేనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

గ‌తంలో వైఎస్సార్‌ను ఉద్దేశించి కూడా ఇదే ర‌కంగా బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తామ‌ని హెచ్చ‌రించార‌ని గుర్తు చేశారాయ‌న‌. ప్ర‌జ‌లు ఎవ‌రి బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టి త‌రిమేశారో రాష్ట్ర ప్ర‌జలంద‌రికీ తెలుస‌న్నారు. సిగ్గుండాల‌ని ప‌వ‌న్‌ను ఉద్దేశించి అన్నారు. పార్టీ పెట్టి, రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావ‌న్నారు. రెండు చోట్లా నీ బట్ట‌లూడ‌దీసి, ప్ర‌జ‌లు త‌రిమికొట్టార‌ని ప‌వ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నువ్వేంది వైసీపీ నేత‌ల్ని, ముఖ్య‌మంత్రిని బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టేద‌ని ప‌వ‌న్‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ భాష ఎక్క‌డ నేర్చుకున్నావ‌న్నారు. 

ఏ రాజ‌కీయ నాయ‌కుడు ఇలాంటి భాష మాట్లాడ‌ర‌న్నారు. అస‌లు నీకో పార్టీ, దానికో గుర్తు ఉందా? అని ప్ర‌శ్నించారు. బ‌ట్ట‌లూడ‌దీసి చూడాల‌నే కోరిక వుంటే చెప్పు… తామే వ‌స్తామ‌ని ఆయ‌న అన్నారు. త‌మ బ‌ట్ట‌లు ప‌వ‌న్‌ విప్ప‌న‌వ‌స‌రం లేకుండా, తామే విప్పి చూపిస్తామ‌ని వ్యంగ్యంగా అన్నారు. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని, నోరు నీకే కాదు, త‌మ‌కూ ఉంద‌ని ప‌వ‌న్‌ను ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి అన్నారు. తాము కూడా ఇష్టానుసారం మాట్లాడ‌గ‌ల‌మ‌న్నారు. కొంచెమైనా సిగ్గుండాల‌ని హిత‌వు ప‌లికారు. 

చిరంజీవి పెద్ద మ‌నిషి అన్నారు. మాస్ హీరో అని అన్నారు. మంచి మ‌న‌సున్న మారాజు అని చిరంజీవిని పొగిడారు. వాళ్ల తండ్రి ఇంకా పెద్ద మ‌నిషి అని ఆయ‌న అన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టి ఏం భాష మాట్లాడుతున్నావ‌ని ప‌వ‌న్‌ను నిల‌దీశారు.  పార్టీ, సిద్ధాంతాలు, రాష్ట్రానికి ఏం చేస్తావో చెప్పుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

ప‌వ‌న్ వ‌ల్ల చిరంజీవి, ఆయ‌న తండ్రికి ప‌రువు పోతోంద‌న్నారు. చిరంజీవి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా ప‌ద్ధ‌తిగా ఉన్నార‌న్నారు. అది ప‌వ‌న్‌ ద‌గ్గ‌ర లేద‌న్నారు. ప‌వ‌న్ ఓ పిచ్చోడ‌న్నారు. అత‌న్ని హైద‌రాబాద్ ఎర్ర‌గ‌డ్డ లేదా విశాఖ‌లోని పిచ్చాస్ప‌త్రిలో చేర్పిస్తే మంచిద‌ని ఆయ‌న సూచించారు. త‌మ కుటుంబం 1961 నుంచి రాజ‌కీయాల్లో ఉంద‌న్నారు. ఇలాంటి భాష మాట్లాడే రాజ‌కీయ నాయ‌కున్ని ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. భ‌విష్య‌త్‌లో చూడ‌లేమ‌న్నారు.