అయోధ్య ఆలయాన్ని కూల్చేస్తారట…!

పాకిస్తాన్‌ను ఓ వైపు యుద్ధ భయం వెంటాడుతున్నా, ఆ దేశంలోని నాయకులు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

పాకిస్తాన్‌ను ఓ వైపు యుద్ధ భయం వెంటాడుతున్నా, ఆ దేశంలోని నాయకులు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తాము వీరులం, శూరులం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తమ శక్తి ముందు భారత్ దిగదుడుపే అన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారు. పాకిస్తాన్ సెనేటర్ పాల్వాషా ఖాన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌ లో ఉన్నాయనుకుంటే, పాల్వాషా ఖాన్ వంటి నాయకులు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.

భారతీయుల, ముఖ్యంగా హిందువుల మనోభావాలు రెచ్చగొడుతున్నారు. అయోధ్య ఆలయాన్ని కూలగొట్టి అక్కడ బాబ్రీ మసీదుకు పునాది వేస్తామని పాల్వాషా ఖాన్ అన్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ తొలి ఆజాన్ ఇస్తాడని పేర్కొన్నాడు. తాము గాజులు తొడుక్కొని కూర్చోలేదని, భారత్‌కు తగిన జవాబు ఇస్తామని అన్నాడు. భారత్‌లోని సిక్కు సైన్యం పాకిస్తాన్‌పై దాడి చేయదని, సిక్కుల మతగురు గురునానక్ జన్మస్థలం పాకిస్తానేనని సెనేటర్ ఖాన్ అన్నాడు.

అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు, అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించాడు. ఆ తరువాత పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర ముఠా జైషే మహ్మద్‌ బెదిరింపులకు పాల్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రస్తావిస్తూ కల్లోల పరిస్థితులు సృష్టిస్తామని హెచ్చరించింది. పాక్ ఉగ్రవాదులకు రామాలయం ఎప్పటినుంచో టార్గెట్‌గా మారింది. రామ మందిరంపై ఉగ్రదాడి జరగబోతోందన్న బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి.

పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ రామ మందిరంపై దాడి చేస్తామంటూ ఆడియో వార్నింగ్ ఇచ్చింది. ఆలయాన్ని కూల్చేస్తామని హెచ్చరించింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భద్రతను పెంచారు. అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తామని హెచ్చరించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇంతకుముందు కూడా ఇక్కడ దాడులు చేసింది.

2005లో ఈ ఉగ్రవాద సంస్థ మందుగుండు సామగ్రి నింపిన జీపుతో ఆలయంపై దాడి చేసింది. ఈ దాడి 2005, జూలై 5న జరిగింది. ఈ దాడి తర్వాత దేశ భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ముప్పు వెలుగులోకి వచ్చింది. 2023లో ఇక్కడ పేలుళ్లకు పాల్పడతామని తీవ్రవాద సంస్థలు హెచ్చరించాయి. అయితే, ఆ బెదిరింపు ఫేక్ అని తర్వాత రుజువైంది. ఇప్పుడు మళ్లీ అయోధ్య ఆలయాన్ని కూల్చేస్తామని బెదిరిస్తున్నారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ కూడా భారత్‌పై నోరు పారేసుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కాబట్టి భారత్ దాడి చేయడం అంత సులభం కాదన్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని రక్షించే శక్తిని అల్లా ఇచ్చాడుకాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాక్ బెదిరింపుల నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.

13 Replies to “అయోధ్య ఆలయాన్ని కూల్చేస్తారట…!”

  1. Manam ikkada vattaka levaka poyina thodalu kodthu pakistan meeda rankelesthuntam kada. Alagae akkada vallu kuda manameeda rankelesthu untaru. Anthae. Indulo manam ulikki padalsina avasaram ledu. 

    1. మీలాంటి హిందూ వ్యతిరేఖ పాకిస్తాన్ కట్టు  బానిసలు ఇక్కడే వుండగా, వాళ్ళకి ప్రతి రోజు ఈద్ పండుగే కదా.

      1. ఒక వేళ పాకిస్తాన్ యుద్ధం వస్తె, పాకిస్తాన్ వాళ్ళ మొ*డ్ద చీకడానికి రెడీ గా వున్న ఇక్కడ ముస్లిం లు చాలా మంది మన మధ్యలోనే రెడీగా వున్నారు అని ఒక్కడి జనాలకి ఎపుడో అర్థం అయింది.

          1. Saduddesam tho, sakrama margam lo Desaniki thappaka supportcheyyali. Anthae gaani, Godi ki, Beedi ki support cheyyamantaene janalaki kaaledi. Pahalgamlo vearu chesaru. Indulo hindutwavadula hastham unda, pakitan hastham unda leka, leka inkevari hastham undi ani mundu detailga enquiry chesthae thelusthundi. Ennikallo 420 vasthayani virraveegi aa nalugu, rendu thiragabadithae mingaleka ee sketch yesaro emonani anumanam kuda untadi kada. 

  2. పాకిస్తాన్ కి సపోర్ట్ గా వున్న మన దేశం లో వాళ్ళని ఒక పెద్ద రైలు లో పడేసి తీసుకెళ్ళి పాకిస్తాన్లో కి విసిరేయాలి.

Comments are closed.