సీఎంవో సీరియ‌స్‌.. ప‌వ‌న్ సైలెన్స్‌!

విశాఖ జిల్లాలోని భౌగోళిక వార‌స‌త్వ సంపదైన ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌ల‌ను అక్ర‌మార్కులు కొల్ల‌గొట్ట‌డం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మ‌న దేశంలో కేవలం రెండు చోట్ల మాత్ర‌మే ఇలాంటి వార‌స‌త్వ సంప‌ద ఉంద‌ని, కొత్త ప్ర‌భుత్వం…

విశాఖ జిల్లాలోని భౌగోళిక వార‌స‌త్వ సంపదైన ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌ల‌ను అక్ర‌మార్కులు కొల్ల‌గొట్ట‌డం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మ‌న దేశంలో కేవలం రెండు చోట్ల మాత్ర‌మే ఇలాంటి వార‌స‌త్వ సంప‌ద ఉంద‌ని, కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా దోపిడీ కొన‌సాగ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి అయిన త‌మ పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టికి ప్ర‌త్యేకంగా తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ్డంపై ప‌దేప‌దే మాట్లాడే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెంట‌నే స్పందిస్తార‌ని అంతా అనుకున్నారు. అదేంటో గానీ, ఇంత వ‌ర‌కూ ఆయ‌న నుంచి ఎలాంటి రియాక్ష‌న్ లేదు. రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని భావించిన టీడీపీ, వెంట‌నే యాక్ష‌న్‌లోకి దిగింది. విశాఖ‌లో ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌ల త‌ర‌లింపుపై సీఎంవో సీరియ‌స్ అయ్యిన‌ట్టు పెద్ద ఎత్తున త‌న మీడియాతో ప్ర‌చారానికి తెర‌లేపింది.

ప‌వ‌న్ మాత్రం సైలెంట్‌. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కాసింత నిరుత్సాహానికి గుర‌య్యారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తార‌ని అనుకుంటే, ఆ అవ‌కాశాన్ని టీడీపీకి ఇచ్చార‌నే ఆవేద‌న జ‌న‌సేన నాయ‌కుల్లో క‌నిపిస్తోంది.

ఎందుకంటే ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌ల్ని దోపిడీ చేస్తున్న‌దే టీడీపీ నాయ‌కుల‌ని, త‌మ నాయ‌కుడు వెలుగులోకి తెచ్చి ప్ర‌శంస‌లు అందుకున్నాడ‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. కానీ దీన్ని రాజ‌కీయంగా క్యాష్ చేసుకోవ‌డంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉదాసీనంగా ఎందుకు వ్య‌వ‌హ‌రించారో అర్థం కావ‌డం లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు వాపోతున్నారు. 

15 Replies to “సీఎంవో సీరియ‌స్‌.. ప‌వ‌న్ సైలెన్స్‌!”

    1. Yes! Give them some time to clear all those Red Clay hills! After that, you can ask them on the empty soil!

      మన వాళ్ళు మంచి సలహాలు యిస్తారండి! ఎర్రమట్టి దిబ్బలు పూర్తిగా నామరూపాలు లేకుండా తొలగించేంత వరకు TDP వారికి సమయము యివ్వాలి! ఆ తరువాత- ప్రభుత్వం ఏమి చేస్తుంది?

      80 లక్షల టన్నుల ఇసుకను- దోపిడీ చేసి- 40 లక్షల టన్నులకు తెచ్చిన తరువాత- “ఉచిత యిసుక”

      అని రూ.1300 పైన దోచుకుంటూ- ప్రభుత్వానికి నామము పెట్టారు!దాదాపుh రోజుకొక హత్య జరిగిస్తూ ఉన్నారు! ఇంకా కొంత సమయం వారికివ్వాలి- ఇంతలో ఇంకా కొంతమందిని కడతేర్చేంత వరకు సమమివ్వాలి- అప్పుడు లా అండ్ ఆర్డర్ విషయాలు చూసుకుంటారు!

      పెన్సన్స్ సెట్ చేయుటకు ఇంకా కొంత సమయమివ్వాలి- ఈమధ్యలో కొంతమంది కాలం చెల్లి పోవాలి! బలే ఉందండి సలహాలు!

  1. :Leeki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

  2. ఆయన ప్రతిపక్షం గా ఉంటేనే సమస్యల మీద స్పందిస్తారు, అధికారం లో ఉంటే వాటిని ప్రిషరించాల్సి వస్తుంది.

Comments are closed.