ష‌ర్మిల‌ను చూసి నవ్వుతున్నారు- రోజా

గ‌త రెండు రోజుల నుండి మెగా డీఎస్సీ పేరుతో ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన హడావుడిపై మండిప‌డ్డారు మంత్రి రోజా. నాలుగున్న‌రేళ్లు తెలంగాణ బిడ్డ‌ను అంటూ చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి హ‌డావుడి చేస్తున్నార‌ని…

గ‌త రెండు రోజుల నుండి మెగా డీఎస్సీ పేరుతో ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన హడావుడిపై మండిప‌డ్డారు మంత్రి రోజా. నాలుగున్న‌రేళ్లు తెలంగాణ బిడ్డ‌ను అంటూ చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి హ‌డావుడి చేస్తున్నార‌ని సీరియ‌స్ అయ్యారు. చంద్ర‌బాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాట‌కంలో ష‌ర్మిలను పావుగా ఉప‌యోగించుకున్నార‌న్నారు. 

ఇవాళ తిరుమ‌ల‌లో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17వేల పోస్టులను భర్తీ చేశారని.. తాజాగా 6,100 ఉద్యోగుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చిన చంద్ర‌బాబు కోసం ప్ర‌భుత్వంపై ష‌ర్మిల ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతోంద‌ని మండిపడ్డారు. 

చంద్ర‌బాబు మెప్పు కోసం ష‌ర్మిల‌.. సీఎం జ‌గ‌న్‌పై విషం చిమ్ముతూ ఆరాటాలు, పోరాటాలను చూసి జ‌నం న‌వ్వుకుంటారంటూ హిత‌వు ప‌లికారు. జ‌న‌సేన‌ పవన్ కల్యాణ్‌ పిచ్చి పిచ్చిగా.. ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్ర‌బాబు కోస‌మే కాంగ్రెస్ రూపంలో ష‌ర్మిల‌, జ‌న‌సేన రూపంలో ప‌వ‌న్ పని చేస్తున్న‌ర‌ని ఎద్దేవా చేశారు.

కాగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి సెక్రటేరియెట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. ష‌ర్మిల‌, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారు చెప్పింది కూడా వినకుండా అలాగే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆమెను అదుపులోకి తీసుకోని త‌ర్వాత వ‌దిలేశారు.