లోకేశ్ చెంప‌లు వాయించేలా రోజా కౌంట‌ర్‌!

నారా లోకేశ్‌కు చెంప‌లు వాయించేలా మంత్రి ఆర్కే రోజా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. పాద‌యాత్ర‌లో భాగంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని చిన‌రాజ‌కుప్పంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో లోకేశ్ మాట్లాడుతూ రోజాపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి…

నారా లోకేశ్‌కు చెంప‌లు వాయించేలా మంత్రి ఆర్కే రోజా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. పాద‌యాత్ర‌లో భాగంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని చిన‌రాజ‌కుప్పంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో లోకేశ్ మాట్లాడుతూ రోజాపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి పోటీగా డైమండ్ పాప త‌యారైంద‌ని లోకేశ్ విమ‌ర్శించారు. డైమండ్ పాప అన్నాన‌ని మొన్న రోజా బాగా ఫీల్ అయ్యింద‌ట అన్నారు. ఇక నుంచి రోజా ఆంటీ, జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అని పిలుస్తా అన్నారు.

త‌న‌ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడ్డంపై ఇవాళ రోజా మండిప‌డ్డారు. లోకేశ్‌ను ఏమ‌న్నారో రోజా మాట‌ల్లోనే తెలుసుకుందాం. “లోకేశ్ అంకుల్ నువ్వు ఐర‌న్ లెగ్. నువ్వు అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఈ రాష్ట్రానికి, మీ కుటుంబానికి, మీ నాన్న‌కి కూడా స‌ర్వ‌నాశ‌నం స్టార్ట్ అయ్యింది. నువ్వెప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంట‌ర్ అయ్యావో అప్ప‌టి నుంచి మీ నాన్న ప‌త‌నం మొద‌లైంది. పాద‌యాత్ర మొద‌లైన‌ప్ప‌టి నుంచి మ‌నుషులు చ‌చ్చిపోతున్నారు. ఏమేమో జ‌రిగిపోతోంది. నీ లాంటి ఐర‌ల్ లెగ్ అంకుల్ తిరిగితే త‌మ‌కేమ‌వుతుందోన‌నే భ‌యంతోనే జ‌నాలు బ‌య‌టికి రావ‌డం లేదు. జ‌నాల కోసం 12 నుంచి 14 గంట‌ల‌పాటు ఎదురు చూస్తున్నావంటే నీ లీడ‌ర్‌షిప్ ఎలా వుందో అర్థం చేసుకోవాలి.

ఎవ‌రికీ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా నువ్వు, నేను వెళ్దాం. జ‌నం ఎవ‌రికి ఎక్కువ వ‌స్తారో చూద్దాం. జ‌బ‌ర్ద‌స్త్ అనేది చాలా మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన మంచి కామెడీ షో. దాన్ని బూతులాగా వెట‌కారంగా మాట్లాడితే మ‌హిళ‌లు దేంతో కొట్టాలో దాంతో కొడ్తారు. ముఖ్యంగా జ‌గ‌న్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. పోతే పోనీలే అని జ‌గ‌న్ వ‌దిలేశాడు. నీ మీద జ‌గ‌న్ దృష్టి పెడితే ఎక్క‌డుంటావో తెలియ‌దు.

మైకు లాక్కుంటున్నార‌ని లోకేశ్ ప‌దేప‌దే అంటున్నాడు. మైకు ఇస్తే ఏం చేస్తావ్‌? ప‌నిముట్ల‌ని పంది ముట్లు, ప్ర‌శాంత‌త‌ను ప్ర‌శాంత అత్త‌, క్వారీల‌ను కొర్రీలు అంటావు. మాట్లాడ్డం కూడా చేత‌కాని నీకు …మైక్ ఇస్తే మేము భ‌య‌ప‌డాలా?. ఆడ‌వాళ్ల‌ను చుల‌క‌న‌గా మాట్లాడే స్వ‌భావం తండ్రి చంద్ర‌బాబునాయుడి నుంచి వ‌చ్చింది. ఆడ‌వాళ్ల‌ను అవ‌మానించిన చంద్ర‌బాబుకు ఏ గ‌తి ప‌ట్టిందో తెలుసుకుని మ‌సులుకో. రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగా ఎదుర్కో.

నువ్వు అంకుల్ కాదా? మీ నాన్న తాత కాదా? మీ అమ్మ అవ్వ కాదా? మీ అమ్మ‌కు ఏమైనా 16 ఏళ్ల వ‌య‌స్సా? తిరిగి మాట్లాడితే త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో తెలియ‌దు! జాగ్ర‌త్త‌గా వుండు ” అని లోకేశ్‌కు గ‌ట్టిగా బుద్ధి చెప్పారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌, రోజాల‌ను లోకేశ్ టార్గెట్ చేస్తున్నారు. లోకేశ్‌కు బుద్ధి చెప్ప‌డంలో త‌గ్గేది లే అని రోజా ఎప్ప‌టిక‌ప్పుడు తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. తాజాగా లోకేశ్‌కు రాజ‌కీయంగా చెంప‌లు వాయించేలా రోజా స‌మాధానం ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.