సంచలనం…లాకప్ లో రామోజీనా?

ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. అందులో ఓ సంచలన విషయం వుంది. దేశంలోని అత్యంత శక్తిమంతుల్లో ఒకరు అనుకునే రామోజీరావు తన ప్రస్థానం ఆరంభంలో నాలుగు రోజుల…

ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. అందులో ఓ సంచలన విషయం వుంది. దేశంలోని అత్యంత శక్తిమంతుల్లో ఒకరు అనుకునే రామోజీరావు తన ప్రస్థానం ఆరంభంలో నాలుగు రోజుల పాటు లాకప్ లో వున్నారు అన్నది ఆ సంచలన విషయం. 

మార్గదర్శి చిట్స్ పెట్టకముందే అనాధరైజ్డ్ గా చిట్స్ రన్ చేసిన కారణంగా అబిడ్స్ పోలీసలు రామోజీని పిలిపించి, నాలుగు రోజులు లాకప్ లో వుంచారన్న విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ విషయం ప్రసాద్ అనే ఆయన చెప్పారని, తనకు త్వరలో పూర్తి వివరాలు ఇస్తా అన్నారని ఉండవల్లి చెప్పారు.

ఈ విషయం అప్పారావు గారికి తెలుసు అని ఉండవల్లి అనడం ఆ వీడియోలో వుంది. మరి అప్పారావు అంటే రామోజీ తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావునా అన్నది వీడియో కట్లో క్లారిటీ లేదు. 

ఇదే కాదు, తాను రామోజీ మీద పోరాడుతున్న సంగతి తెలిసి చాలా మంది తనకు చాలా అంటే చాలా విషయాల మెయిల్స్ లొ, వాట్సాప్ లో పంపిస్తున్నారని చెప్పారు. వాటిల్లో చాలా విషయాలు వున్నాయని, ఎక్కడో దేవుడి భూములు తీసేసుకున్నారనే లాంటి సంగతులు వున్నాయని, కానీ అవన్నీ బయటకు తెస్తే, ముందు మార్గదర్శి విషయం పక్కకు పోతుందని ఉండవల్లి అన్నారు.

అబిడ్స్ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెనుక ప్రముఖ సంపాదకుడు ఎబికె ప్రసాద్ రాసిన వ్యాసం వుందని చెప్పడం గమనార్హం. ఆ సంఘటన. తరువాతే మార్గదర్శి రిజిస్టర్ చేసారని, ఆ తరువాతే ఈనాడు స్టార్ట్ చేసారని ఉండవల్లి అన్నారు. త్వరలో తాను మీడియా తో మాట్లాడేటపుడు ఈ విషయాలన్నీ క్లియర్ గా వివరిస్తా అన్నారు.