జ‌నం న‌వ్వుతార‌య్యా!

వ‌రుస‌గా నాలుగు సార్లు జ‌నం ఆద‌ర‌ణ నోచుకోక వ‌రుస ఓట‌ముల‌ను మూట క‌ట్టుకున్న నాయ‌కుడు కూడా వైఎస్ జ‌గ‌న్ విజ‌యాల‌పై మాట్లాడుతున్నారు. త‌న మాట‌లు వింటే జ‌నం న‌వ్విపోతార‌ని కూడా అనుకోకుండా, అందుకు విరుద్ధంగా…

వ‌రుస‌గా నాలుగు సార్లు జ‌నం ఆద‌ర‌ణ నోచుకోక వ‌రుస ఓట‌ముల‌ను మూట క‌ట్టుకున్న నాయ‌కుడు కూడా వైఎస్ జ‌గ‌న్ విజ‌యాల‌పై మాట్లాడుతున్నారు. త‌న మాట‌లు వింటే జ‌నం న‌వ్విపోతార‌ని కూడా అనుకోకుండా, అందుకు విరుద్ధంగా ఆయ‌న నోరు పారేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

టీడీపీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్న విష‌యం తెలిసిందే. సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే అంద‌రూ త‌న‌తో క‌లిసి రావాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్న విష‌యం తెలిసిందే. సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని టీడీపీ, జ‌న‌సేన‌ల‌పై వైసీపీ నేత‌లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా వైసీపీని వెట‌క‌రించారు. ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మంత్రి దాడిశెట్టి రాజా జ‌న‌సేనానిపై చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి వార్త‌ను షేర్ చేశారు. సోమిరెడ్డి ట్వీట్ ఏంటంటే…

“అవినీతి కంపుకొట్టే మీ పక్కన నిలిచేందుకు ఏ పార్టీ ఇష్టపడదు. మీరు ఎవరితోనూ పొత్తుపెట్టుకోకపోవడం కాదు. మీతో చేయి కలపడానికే ఎవరూ సిద్ధంగా లేరు. గోదాట్లో కొట్టుకుపోతున్న గ్రామసింహం తోక ఎవ్వరూ పట్టుకోరనే నిజాన్ని కప్పెట్టి సింహంలా ఒంటరిగా వస్తామనే మీ గొప్పలు చూసి జనం నవ్విపోతారు” అని సోమిరెడ్డి విమ‌ర్శించారు.

జ‌నం మ‌రిచినా … ఇంకా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న సోమిరెడ్డి ప్ర‌జ‌లు న‌వ్వితార‌ని సెటైర్ విస‌ర‌డంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇంకా సోమిరెడ్డి లాంటి నాయ‌కుల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్లే ఇవాళ టీడీపీకి ఈ దుస్థితి అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. 23 సీట్ల‌కే జ‌నం ఎందుకు ప‌రిమితం చేశారో ఆలోచించి, త‌ప్పులు స‌రిదిద్దుకోడానికి బ‌దులు, ప్ర‌త్య‌ర్థుల‌పై అవాకులు చెవాకులు పేల‌డం సోమిరెడ్డికే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.