హైకోర్టు ఏం చెబుతుందో చూద్దాం!

హైకోర్టులో న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

లిక్క‌ర్ కేసులో సిట్ అధికారులు త‌మ‌ను అరెస్ట్ చేయాల‌ని చూస్తున్నార‌ని,. ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరిన మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు సుప్రీంకోర్టులో ఆశించిన న్యాయం దొర‌క‌లేదు. ఈ నెల 7న ఏపీ హైకోర్టులో కేసు విచార‌ణ‌కు రానున్న నేప‌థ్యంలో, అక్క‌డేం చెబుతారో చూసిన త‌ర్వాతే ఏదైనా చేస్తామ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

అయితే ముంద‌స్తు బెయిల్ కోరుతూ ఈ ముగ్గురు ఇప్ప‌టికే ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే అరెస్ట్ కాకుండా అడ్డుకోలేమ‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో త‌మ వాద‌న‌ను హైకోర్టు ప‌ట్టించుకోలేద‌ని, హ‌క్కుల్ని ప‌రిర‌క్షించ‌లేదంటూ ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. కానీ ఏపీ హైకోర్టులో 7న విచారించ‌నున్న సంగ‌తి తెలుసుకున్న సుప్రీంకోర్టు, అంత వ‌ర‌కూ వేచి చూడాల‌ని సూచించింది.

హైకోర్టులో న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక‌వేళ అక్క‌డ పిటిష‌న‌ర్లు ఆశించిన తీర్పు వెలువ‌డ‌క‌పోతే, 8న విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డి పిటిష‌న్ల‌తో క‌లిపి విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల చెప్పిన సంగ‌తి తెలిసిందే. సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ద‌క్కింది.

అయితే పూర్తిస్థాయిలో బెయిల్ కావాల‌ని ఆయ‌న న్యాయ‌పోరాటం చేస్తున్నారు. ఆ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ జ‌ర‌ప‌నుంది. అయితే ఈ కేసులో ఎలాగైనా వైసీపీ ముఖ్య నేత‌లంద‌రినీ అరెస్ట్ చేయాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశంగా క‌నిపిస్తోంది. లిక్క‌ర్ కేసులో సిట్ ఆరోప‌ణ‌ల‌కు త‌గ్గ‌ట్టు ఆధారాలు ఏ మేర‌కు ఉన్నాయ‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న‌.

2 Replies to “హైకోర్టు ఏం చెబుతుందో చూద్దాం!”

  1. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో సిట్ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి ఎవరు తప్పించుకోలేరు అని రాశారు కదా గతంలో గుర్తు ఉందా.

Comments are closed.