ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తూ… అర్జీలు స్వీక‌రిస్తూ!

అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విద్య‌, ఐటీశాఖల‌ మంత్రి నారా లోకేశ్ ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తున్నారు.

అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విద్య‌, ఐటీశాఖల‌ మంత్రి నారా లోకేశ్ ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తున్నారు. ఇవాళ ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో 61వ రోజు ప్ర‌జాద‌ర్బార్ లోకేశ్ నిర్వ‌హించారు. ప్ర‌జాద‌ర్బార్‌పై ముందే ప్ర‌చారం చేయ‌డంతో వివిధ స‌మ‌స్య‌ల‌తో జ‌నం పోటెత్తారు.

వివిధ ప్రాంతాల నుంచి ప్ర‌జాద‌ర్బార్‌కు వెళ్లిన ప్ర‌తి ఒక్క‌ర్నీ లోకేశ్ ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తూ, వారి నుంచి అర్జీలు స్వీక‌రించారు. ముఖ్యంగా పెన్ష‌న్‌, భూ సంబంధిత స‌మ‌స్య‌లు, ఉద్యోగ‌, ఉపాధి, వైద్య‌ప‌ర‌మైన సాయం కోసం లోకేశ్‌కు భారీగా విన్న‌వించారు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య స్వ‌యంగా తెలుసుకుని, త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని వారికి లోకేశ్ హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేస్తుండగా తన భర్త విద్యుత్ షాక్ కు గురై 2020లో మరణించాడని, కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని చిలకపాలెం గ్రామానికి చెందిన డి.రేవతి మంత్రి నారా లోకేశ్‌కు విన్నవించారు. కుటుంబ పోషణ భారమైంద‌ని, తన ఇద్దరు పిల్లల చదువుల కోసం ఏదైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయాలు నిరాదరణకు గురయ్యాయని, పుస్తకాల కొనుగోళ్లు నిలిచిపోయాయని, నిర్వహణ సక్రమంగా లేదని, విద్యాసంస్థల్లోనూ గ్రంథాలయాల నిర్వహణ నామమాత్రంగా ఉందని లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని సమైక్య యూత్ ప్రతినిధులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. మూడు దశాబ్దాల నుంచి కొయ్యలగూడెంలో డిగ్రీ కాలేజీ లేక పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని మంత్రికి వివ‌రించారు.

పుట్టుకతో దివ్యాంగుడైన తన కుమారుడికి దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ పోరంకికి చెందిన ఐ.వరప్రసాద్ మంత్రికి విన్న‌వించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, కవులూరులో తమకు నివేశన స్థలాన్ని మంజూరు చేసి ఇంటి పట్టా కూడా ఇచ్చారని, ఈ రోజు వరకు సదరు స్థలాన్ని చూపించలేదని విజయవాడ జక్కంపూడికి చెందిన అన్నమరాజు ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు మంజూరు చేసిన స్థలం జాడచూపించి, ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

2017-18 అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని న‌లుమూల‌ల నుంచి వివిధ స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చిన ప్ర‌జానీకం లోకేశ్‌ను క‌లిసి త‌మ గోడు వెల్ల‌బోసుకోవ‌డం గ‌మ‌నార్హం.

12 Replies to “ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తూ… అర్జీలు స్వీక‌రిస్తూ!”

  1. మా జగన్ రెడ్డి అయితే.. అధికారంలోకి రాగానే.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తాడు..

    ఈ కోటి పిచ్చెమిటో అర్థం కాదు..

  2. అప్పట్లో  తాడేపల్లి ప్యాలస్ లో జగనన్న ఇలాంటి కార్యక్రమం ఏదో పెట్ట బోతున్నాడు..పెరుగన్నం ,సాంబార్  వేడి వేడి గా చల చల్లగా వండిస్తారు అని ఎదో కథలు అల్లావ్.. ఏమైంది GA??

  3. అధికారం లో ఉన్నప్పుడు తాడేపల్లి పరదాల పిల్లి ఏం చేసిందో కూడా రాయి..

  4. ఇన్నాళ్లు రాష్ట్రం నీ దోచుకున్న లక్షల కోట్లు డబ్బుతో,

    జగన్ రెడ్డి కూడా, ప్రజల కోసం కాకపోయినా

    సొంత పార్టీ లో నిరుపేద కార్యకర్తలు లో ఒక లక్ష మంది నీ ఎంపిక చేసి, వాళ్ళకి ప్రతి నెలా ఒక వెయ్యి రూపాయలు ఇస్తువుంటే, కనీసం ఆ 11 సీట్లు అయినా గ్యారంటీ వుంటది, వచ్చే సారి.

    అతనికి వున్న ఆస్తి లో అవి లెక్క లోకి కూడా రావు, ఆ ఖర్చు.

    కానీ, అతనికి దోచుకోవడమే కానీ జేబులో డబ్బు తీసి ఇచ్చే అలవాటు లేదు అని ప్రూవ్ అయింది.

    1. సొంత పార్టీ కార్యకర్తలు కి ఆరోగ్య సమస్యలు తో వచ్చి కాస్త సహాయం చేయమని అడిగినా కూడా, నిర్దాక్షిణ్యంగా ప్యాలెస్ గేట్లు ముందు నుండే వాళ్ళని చావ బాది తరిమేసిన సంఘటనలు కోకొల్లలు, సొంత పార్టీ వాళ్ళ ద్వారానే చెప్పబడిన నిజాలు. 

      1. అతను మాత్రం ఆదివారం వస్తె చాలు మసాజీ కోసం బెంగళూరు ప్యాలెస్ కి విమానంలో టింగు రంగ మంటూ వెళతాడు. 

        అలాంటి వాడికి మరల అధికారం ఇవ్వమని మనకి గ్రేట్ ఆంద్ర డబ్బా కొడుతున్నాడు.

Comments are closed.