వైసీపీ మ‌హిళా ఎంపీపీపై దారుణ పోస్టులు!

కుప్పం ఎంపీపీపై సోష‌ల్ మీడియాలో దారుణ పోస్టులు పెడుతోంది. మాన‌సికంగా ఆమె తీవ్ర‌స్థాయిలో దాడికి పాల్ప‌డుతోంది. అయిన‌ప్ప‌టికీ అధికార పార్టీ క‌ళ్ల‌ప్ప‌గించి నిస్స‌హాయంగా చూడ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.  Advertisement టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు మూడు…

కుప్పం ఎంపీపీపై సోష‌ల్ మీడియాలో దారుణ పోస్టులు పెడుతోంది. మాన‌సికంగా ఆమె తీవ్ర‌స్థాయిలో దాడికి పాల్ప‌డుతోంది. అయిన‌ప్ప‌టికీ అధికార పార్టీ క‌ళ్ల‌ప్ప‌గించి నిస్స‌హాయంగా చూడ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు మూడు రోజుల ప‌ర్య‌ట‌న తీవ్ర వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం భౌతిక‌దాడుల‌కు పాల్ప‌డ్డాయి. రెచ్చ‌గొట్టింది నువ్వెంటే నువ్వ‌ని రెండు పార్టీల నేత‌లు విమ‌ర్శించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అశ్వినిపై రాళ్ల దాడికి టీడీపీ కార్య‌క‌ర్త‌లు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో స్వ‌ల్పంగా ఆమె గాయ‌ప‌డ్డారు. తృటిలో ప్రాణాపాయం త‌ప్పింద‌ని ఆమె క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు. అశ్వినీ ఆవేద‌న‌పై సోష‌ల్ మీడియాలో టీడీపీ సెటైర్స్ విసిరింది. ఆమెను వ్య‌క్తిగ‌తంగా కించ‌ప‌రుస్తూ పోస్టులు పెట్టే వ‌ర‌కూ టీడీపీ సోష‌ల్ మీడియా వెళ్లింది.

అశ్వినీకి కుప్పం స్థానిక నాయ‌కుల‌తో సంబంధాల‌ను అంట‌క‌డుతూ పోస్టులు పెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఆమె ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి, ఇష్టానురీతిలో యువ ఎంపీపీని టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. క‌ర్రి పిల్ల అంటూ ఆమె రంగును అవ‌హేళ‌న చేయ‌డం టీడీపీకే చెల్లింది.  

త‌న‌ను బూతు మాట‌లు తిట్టార‌ని ఎంపీపీ అన‌డంపై…”నువ్వే పెద్ద బూతు బొమ్మ లెక్క వుంటావు. నిన్ను ఎవ‌డు తిట్టాడు బూతు బొమ్మ అస్తి పంజ‌ర‌మా?” అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి వైర‌ల్ చేయ‌డంపై పోలీసులు ఉదాసీన వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.