టీడీపీ మైండ్ గేమ్ కి పడిపోతానా…?

తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ కి పడిపోయే వారు ఎవరూ లేరని మాజీ మంత్రి విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంటున్నారు. తాను వైసీపీలో మంత్రిని అయ్యానని, తొలి విడతలోనే తనకు…

తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ కి పడిపోయే వారు ఎవరూ లేరని మాజీ మంత్రి విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంటున్నారు. తాను వైసీపీలో మంత్రిని అయ్యానని, తొలి విడతలోనే తనకు జగన్ అవకాశం ఇచ్చారని ఆయన చెప్పుకున్నారు.

అలాంటి తాను వైసీపీ బలోపేతం చేస్తాను తప్ప ఎందుకు పార్టీని వీడుతానని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తాను పార్టీ వీడిపోతున్నట్లు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన వైసీపీకే జనాలను ఓట్లు అడిగే హక్కు ఉందని ఆయన అంటున్నారు.

జగన్ని మరో మారు సీఎం చేయడం కోసం తామంతా కృషి చేస్తామని కూడా ఆయన చెబుతున్నారు. వైసీపీ ఏపీలో బలమైన పార్టీ అని, ఆ పార్టీకి ధీటైన విపక్షం కూడా ఏదీ లేదని ఆయన తేల్చేసారు. మొత్తానికి ముత్తంశెట్టి తాను పవర్ ఫుల్ లీడర్ అంటున్నారు.

విశాఖను వైసీపీకి కంచుకోటను చేస్తాను అని కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. మాజీ మంత్రులంతా వైసీపీ నుంచి బయటకు వస్తారని ఈ మధ్యనే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఈ మధ్య చేసిన ప్రకటనలకు మాజీ మంత్రి గారు కరెక్ట్ కౌంటర్ ఇచ్చారనుకోవాలి.