న‌మ్ముతారో… న‌వ్వుతారో మీ ఇష్టం!

రెండోసారి రాజ్య‌సభ స‌భ్య‌త్వాన్ని ద‌క్కించుకున్న విజ‌య‌సాయిరెడ్డి హుషారుమీద ఉన్నారు. ఇవాళ వ‌రుస ట్వీట్ల‌తో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ద‌ఫా రాత‌లు త‌గ్గించి, ఫొటోల‌తో సెటైర్స్ విసిరిన‌ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు ఆక‌ట్టుకుంటున్నాయి.  Advertisement గ‌తంలో…

రెండోసారి రాజ్య‌సభ స‌భ్య‌త్వాన్ని ద‌క్కించుకున్న విజ‌య‌సాయిరెడ్డి హుషారుమీద ఉన్నారు. ఇవాళ వ‌రుస ట్వీట్ల‌తో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ద‌ఫా రాత‌లు త‌గ్గించి, ఫొటోల‌తో సెటైర్స్ విసిరిన‌ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు ఆక‌ట్టుకుంటున్నాయి. 

గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో దావోస్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఎల్లో మీడియా ఆకాశమే హ‌ద్దుగా పొడుగుతూ రాసిన రాత‌ల‌ను తెర‌పైకి తెచ్చి విజ‌య‌సాయి ఎండ‌గ‌ట్టారు.

“న‌మ్ముతారో… న‌వ్వుతారో…మీ ఇష్టం” అనే క్యాప్ష‌న్ పెట్టి సెటైర్ విసిరారు. ఇందులో ఏముందంటే… దావోస్‌నే రాష్ట్రానికి తీసుకొస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన పేప‌ర్ క్లిప్పింగ్‌ని తెర‌పైకి తెచ్చారు. ఇందులో విమానంలోనే విశ్రాంతి తీసుకున్న‌ట్టు, అక్క‌డే ముఖం క‌డుక్కున్నా అని, అలాగే కొన్ని రోజులు స్నానం చేయ‌లేదు (రెడ్ మార్క్‌) అని చంద్ర‌బాబు అన్న మాట‌ల్ని విజ‌య‌సాయిరెడ్డి సంద‌ర్భోచితంగా గుర్తు చేసి వెట‌క‌రించారు. 

ఇదే పోస్టులో రెండు రోజుల్లో రూ.10 ల‌క్ష‌ల 54 వేల 590 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని ప్ర‌స్తావించ‌డం విశేషం. మ‌రోవైపు న‌వ్వ‌కండి, సీరియ‌స్ మ్యాట‌ర్ అంటూ నాటి టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు మాట్లాడుకుంటున్న‌ట్టు వారి ఫొటోను వాడ‌డం హైలెట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రో ట్వీట్‌లో ఆస‌క్తిక‌ర పోస్ట్ ఆవిష్క‌రించారు. టీడీపీకి పూర్వ‌వైభ‌వం అని అచ్చెన్నాయుడు అంటుంటే, లోకేశ్‌బాబు నింపాదిగా ప‌డుకుని దీన‌ర్థం మ‌ళ్లీ 23 సీట్ల వైభ‌వం అనేగా అంటున్న‌ట్టు చిత్రీక‌రించారు. చంద్ర‌బాబు ఏడుస్తున్న ఫొటో కూడా ఉంది. వీరి సంభాష‌ణ‌కు అంతేగా… అంతేగా అనే కోర‌స్ ఇస్తున్న‌ట్టు మ‌రో ఫొటో యాడ్ చేయ‌డం విశేషం.