చందనోత్సవ విషాద పాపం ఎవరిది?

ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం ఏటా ఘనంగా జరుగుతొంది.

ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం ఏటా ఘనంగా జరుగుతొంది. ఈ ఉత్సవానికి రెండు తెలుగు రాష్ట్రలా నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఏ ఏటికి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతోంది.

ఒకనాడు చందనోత్సవానికి భక్తులు పరిమితంగా వచ్చేవారు. అది స్వామి వారి నిజ రూప దర్శనం కోసం చందనం లేకుండా చూసే భాగ్యం కోసం. పెద్దగా ప్రచారం లేకుండా ఈ ఆధ్యాత్మిక వేడుక ముగిసేది. అయితే ఈ ఉత్సవం మీద భారీగా ప్రచారం చేయడంతో భక్తులు లెక్కకు మిక్కిలిగా తరలివస్తున్నారు.

వచ్చిన భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడం కత్తి మీద సాము అవుతోంది. కేవలం ఒక్క రోజులోనే లక్షలాది మంది వస్తే ఏర్పాట్లు కష్టమే అవుతుంది. ఇదిలా ఉంటే ఈసారి చందనోత్సవానికి ఏర్పాట్లు బాగా చేశామని అధికారులు చెప్పినా అనూహ్యంగా గోడ కూలి భక్తులు ఎనిమిది మంది దాకా మరణించారు. చాలా మంది పరిస్థితి ఇబ్బందిగా ఉంది అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ గోడ నాణ్యత లేకుండా కట్టాలని అంటున్నారు. ఏ విధంగానూ కచ్చితతత్వంలో కూడిన నిర్మాణం కాకుండా ఉందని అందుకే ఒక్క గాలి వానకు కూలిపోయింది అని అంటున్నారు. అలా నాణ్యత లేకుండా కట్టిన కాంట్రాక్టర్ ఎవరు, నాణ్యతను పరిశీలించిన అధికారులు ఎవరు అన్న దాని మీద అంతా తర్కించుకుంటున్నారు.

దీని మీద విచారణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేవుడిని చూడాలని భక్తితో వచ్చే అమాయక భక్తుల ప్రాణాలు ఇలా ఏమీ కాకుండా గాలిలో కలసిపోవడం మాత్రం ఎవరినీ క్షమించలేని నేరంగానే అంతా చూస్తున్నారు.

పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అని అంటున్నారు. చనిపోయిన భక్తుల కుటుంబాల ఆర్తనాదాలు ఆలయ ప్రాంగణానికి శుభాన్ని ఇవ్వవని అంటున్నారు. ఇప్పటికైనా భక్తుల విషయంలో ఆర్భాటం ప్రచారం ప్రకటనలు కాకుండా సవ్యంగా ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే అమాయక భక్తులే తమ ప్రాణాలను జీవితాలను కోల్పోతారు అని అంటున్నారు.

40 Replies to “చందనోత్సవ విషాద పాపం ఎవరిది?”

  1. ఎవ్వరిది అయినా చంద్ర బాబు మీదనే కదా బురద చల్లేది…. చల్లెయండి…. ఏదన్నా జగన్కి అదృష్టం బాగా కలిసి వస్తోంది…. ఊహించని విషయాల్లో ఫ్రీగా పొలిటికల్ mileage వచ్చేస్తోంది

  2. ఈ విషాద పాపం చంద్రబాబు ది కాదు . పవన్ కళ్యాణ్ ది కాదు.

    కేవలం జగన్ మోహన్ రెడ్డి ది మాత్రమే .

  3. పిల్లర్స్ లేకుండా, సింగల్ wall beam లేకుండా, 20 అడుగుల గోడ 2023 లో కట్టారు .. తర్వాత బిల్స్ రాక కాంట్రాక్టర్ అదే స్టేజ్ లో పని ఆపేసాడు .. ఇప్పుడు చెప్పరా ఎవరి పాపం ఇది ??

    1. HM emo 20 days back annaru

      Maa gulte mawa emo 2021 ani article release chesyadu

      Miru emo 2023 antunaru 😂

      Annaru oka mata anukoni prv. Govt midha thoseyandi 😂

      Ila ayithe dorikipotharu

  4. Maa babu emo reviews lo busy ga unnaru 

    Maa chinna babu emo pelli lo pappu thintunadu 😂

    Maa sanathani babu emo esari a maala veyali ani alochisthunadu 😂

    Inka jagan emo vallani kalisi ex gratia iche panilo unnnadu 

    Maa gulte emo ee title tho article Simhachalam Tragedy: Wall Built In 21-22 During YCP Rule? Vadiladu…so idtp and yellow media ade ruddesi jagan midha thosesthunaru 🤦‍️😢

  5. Wall was constructed in last 20 days and the interest shown in publicizing and doing photo shoots in the name of arrangements being made along with the priority given in collecting the commissions from the contractor are the main culprits here.

    1. పిల్లర్స్ లేకుండా, సింగల్ plinth wall beam లేకుండా, 20 అడుగుల గోడ 2023 లో కట్టారు .. తర్వాత బిల్స్ రాక కాంట్రాక్టర్ అదే స్టేజ్ లో పని ఆపేసాడని సమాచారం .. ఇప్పుడు చెప్పరా ఎవరి పాపం ఇది ??

      Note : భారతి సిమెంట్ మాత్రమే వాడాలి అని కండిషన్ పెట్టారట

        1. “Notiki vachindi, manasu ku thinchidi kaakunda, nijam mataldali.” – thats a trade mark of Ycheap…

          want example: Sajjala says ycheap doesnot encourage abuse…shameless fellows 

  6. ఆ గోడ వద్ద భక్తులు ఎప్పుడూ ఉండరు. కేవలం చందనోత్సవం రోజునే అంత రష్ ఉంటుంది.అదే గోడను ఆనుకుని ఉన్న స్పెషల్ క్యూలైన్ ..

    అదే రోజు గాలివాన రావడం.. ఆ గోడ నిర్మాణ లోపాలు, ప్రకృతి విపత్తు కారణంగా, ప్రమాదం సంభవించి, గోడ కూలడం అంటే ఎంత దురదృష్టం వెంటాడిందో అర్థం చేసుకోవచ్చు.

    Very unfortunate and Govt should take better steps to avoid this kind of incidents

    1. Your last comment is good, govt should take better steps to avoid this kid of incidents rather than throwing everything on previous government 

      1. పాలన ఎలా చేయాలో మా జగనన్న పాలన చూసి నేర్చుకోవాలి అంటారు..

        1. Jagan proved himself as a much better administrator during crisis times like Covid . Except for road development jagan did better than babu . Babu is a megalomaniac and media hype guy . Failed administrator 

  7. Atyantha chettha palana ranklings lo chandrababu 4 va term , 3 va term record badhalu kottelaa vundhi . Tirumala , srikurmam , sinhachalam .. emi action teeskokundaa AI , IT ane gaali kaburlu chepthu media hype lo chandalapu palana chestunnadu Chandrababu athani totthu Pawan . Chi chi 

  8. భక్తుల దర్శనం రుసుము మీద ఉన్న శ్రద్ద, భక్తులకు దర్శనం సుగమం చేయడంలో లేదు. ఇది ఇప్పటిది కాదు దాదాపు 10 సంవత్సరాల ముందు Rs500/- టికెట్లు తీసుకుని కొండ కూడా ఎక్కలేక వెనుదిరిగిన సందర్భంకూడా ఉంది మాకు. అది కూడా మధ్యాహ్నం వేళ..మా బాల్యంలో నిజరూప దర్శనం చాలా దగ్గర నుండి చూసేవాళ్ళం. ఇప్పుడో దేవుడికి భక్తులకు మధ్య దూరం పెంచేసారు. నిజానికి అంత దూరం నుండి నిజరూపం కంటికి గోచరించడం ఎంతో కష్టం. దీనికి ఎవరు బాద్యులు.

    అలాగె తిరుమల దేవుడికి భక్తులకు కూడా దూరం పెంచేసారు. ఏమంటే భద్రత అంటారు. అంతమంది భద్రతా సిబ్బంది ఉండి ఇంకా భద్రత అంటే అది భక్తులు భరించాలా..

Comments are closed.