బాబుగారు విద్యుత్ చార్జీలు తగ్గిస్తారా లేదా?

చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రతి కుటుంబం మీద కూడా ప్రభావం చూపించే…

చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రతి కుటుంబం మీద కూడా ప్రభావం చూపించే విషయాలలో మొట్టమొదటిది విద్యుత్ చార్జీలు.

జగన్ ప్రభుత్వ హయాంలో చాలా అసమంజసమైన రీతిలో చార్జీలు పెంచుకుంటూ పోయారని, ట్రూ అప్ చార్జీల పేరిట వినియోగదారుల నడ్డి విరిచే టారిఫ్ లు నిర్ణయించారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపక్షాలు అప్పట్లో విమర్శలు కురిపిస్తూ వచ్చాయి. ఏక మొత్తంగా ప్రజలను ఆకట్టుకోవడం లక్ష్యంగా చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలను తగ్గించే అంశాన్ని కూడా తమ హామీలలో చూపించారు.

అయితే ఎప్పటిలోగా తగ్గిస్తారు? అసలు తగ్గిస్తారా లేదా? అనే సందేహం ఇప్పుడు ప్రజలలో కలుగుతోంది. రాష్ట్రంలో నూతన ఇంధన పాలసీ రూపొందించడం గురించి చంద్రబాబు నాయుడు తాజాగా సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో- విద్యుత్ చార్జీలు తగ్గించాలనే అంశం ప్రస్తావనకు రాకపోవడం గురించి ప్రజలలో ఆలోచన మొదలవుతోంది.

ఇంటిగ్రేటెడ్ క్లీనింగ్ ఎనర్జీ పాలసీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురావాలనుకుంటోంది. 2019 తర్వాత ప్రభుత్వ విధానాలతో విద్యుత్తు ఉత్పత్తి రంగం సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు సహజంగానే జగన్ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రంగం గురించి సమీక్ష ప్రారంభించినా ముందు జగన్మోహన్ రెడ్డిని నిందించడంతోనే అది ప్రారంభం అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సంగతి పక్కన పెడితే తాను ప్రజలకు ఇచ్చిన హామీ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ఎప్పటి నుంచి అమలు చేయదలుచుకుంటున్నారో చంద్రబాబు చెప్పాల్సి ఉంది. పర్యావరణహితంగా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా పాలసీ రూపకల్పన గురించి చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన విధానాలను అధ్యయనం చేసే పాలసీకి రూపకల్పన చేయాలి అని మార్గదర్శనం చేస్తున్నారు.

రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించాలని కూడా సూచిస్తున్నారు. సౌర విద్యుత్తు ప్యానెళ్ల తయారీ సంస్థలను ఏకంగా రాష్ట్రానికి రప్పించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆశావాహ పరిణామాలే! కానీ ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా విద్యుత్తు చార్జీలు తగ్గించడం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా ముఖ్యం.

ఆ దిశగా చంద్రబాబు సర్కారు కసరత్తు చేయవలసిన అవసరం ఉంది. రాబోయే ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం పడకుండా చూడడంతోపాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుచితమైన రీతిలో టారిఫ్ లు పెంచేశారని అంటున్నారో వాటిని తగ్గించడం కూడా తమ ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు నాయుడు గుర్తించాలి. ఇలాంటి నిర్ణయాలు ప్రజలలో ఆయనకు ఆదరణ పెంచుతాయని కూడా తెలుసుకోవాలి.

14 Replies to “బాబుగారు విద్యుత్ చార్జీలు తగ్గిస్తారా లేదా?”

  1. ఫస్ట్ జగన్ రెడ్డి అవినీతి అక్రమాలకు హత్యలకు శిక్ష పడితే అదే ఎక్కువ ఇప్పటికే 13 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు , ఫ్రీ అవసరం లేదు

  2. ఒక్క విద్యుత్ చార్చీలు ఎమిటి.. ధరలు మొత్తం తగ్గించెస్తాను అని జగన్ 20019 ఎన్నికల ముందు చెప్పాడు! మరి ఎమి పీకాడు?

      1. విద్యుత్ చార్జీలు పెంచను అని అన్నాడు. వీలైతే తగ్గిస్తాను అని అన్నాడు. My guess is power charges won’t raise for the next five years. That’s enough for the people. They will be happy as CBN is not going to raise the power charges 8 times just like Jagan.

    1. జగన్ గారు ఓ ఎర్రిపుకు వ్యక్తి, ఎదో సుడిలో అయ్యాడు సీఎం.

      ఒక్క పని సవ్యంగాలేదు, పగలు ప్రతీకారాలు, బూతులు, కబ్జాలు, లంచాలు, బెదిరించి ఆస్తులు లాక్కోవటం. తు తు వీడు విడి బతుకు, మంచి అవకాశం ఇస్తే తినే దాన్లో ఉచ్చపోసుకున్నాడు. జనం ఛీకొట్టిన ఇంకా ఆంధ్రలో ఉన్నాడు, రాయలసీమ పౌరుషం లేదు బొక్కలేదు.

      పధకాల దరిద్రం వదిలితే ఆంధ్ర బాగుపడుద్ది, అబద్దమో నిజమో చెప్పి బాబుగారు వచ్చారు

      కొంత అభివృద్ధి జరుగుతుంది , జగన్ ఓ చేతకాని దద్దమ్మ అంతే. ఓ మహమ్మారి వదిలిపోయింది అదేపదివేలు. జై శ్రీరామ్!!

      ప్రజల బాగుకోసం కొన్నిసార్లు కొన్నిమాటలు చెప్పాలి తప్పులేదు,ధర్మ పరిరక్షణకోసం ధర్మరాజే అబద్దం వాడవలసి వచ్చింది, బాబుగారు కుడా ఆంధ్ర, ఆంధ్రప్రజల సర్వతోముఖఅభివృద్ధికి తప్పులేదు. ఎందుకంటే అది ప్రజలమంచికోసమే కదా!!

  3. జగన్ గారు ఓ ఎర్రిపుకు వ్యక్తి, ఎదో సుడిలో అయ్యాడు సీఎం.

    ఒక్క పని సవ్యంగాలేదు, పగలు ప్రతీకారాలు, బూతులు, కబ్జాలు, లంచాలు, బెదిరించి ఆస్తులు లాక్కోవటం. తు తు వీడు విడి బతుకు, మంచి అవకాశం ఇస్తే తినే దాన్లో ఉచ్చపోసుకున్నాడు. జనం ఛీకొట్టిన ఇంకా ఆంధ్రలో ఉన్నాడు, రాయలసీమ పౌరుషం లేదు బొక్కలేదు.

    పధకాల దరిద్రం వదిలితే ఆంధ్ర బాగుపడుద్ది, అబద్దమో నిజమో చెప్పి బాబుగారు వచ్చారు

    కొంత అభివృద్ధి జరుగుతుంది , జగన్ ఓ చేతకాని దద్దమ్మ అంతే. ఓ మహమ్మారి వదిలిపోయింది అదేపదివేలు. జై శ్రీరామ్!!

    ప్రజల బాగుకోసం కొన్నిసార్లు కొన్నిమాటలు చెప్పాలి తప్పులేదు,ధర్మ పరిరక్షణకోసం ధర్మరాజే అబద్దం వాడవలసి వచ్చింది, బాబుగారు కుడా ఆంధ్ర, ఆంధ్రప్రజల సర్వతోముఖఅభివృద్ధికి తప్పులేదు. ఎందుకంటే అది ప్రజలమంచికోసమే కదా!!

Comments are closed.