డీవీ రుణం కూటమి తీర్చుకుంటుందా?

టీడీపీలో పుట్టి బీజేపీలో రాజకీయం ముగించిన డీవీని కూటమి పాలకులు గౌరవించి ఆయన విగ్రహాన్ని జీవీఎంసీలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ కార్పొరేషన్ తొలి మేయర్ గా నెగ్గిన ఘనత డీవీ సుబ్బారావుది. ఆయన అప్పటికే ప్రముఖ్య న్యాయవాదిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయిదేళ్ళ పాటు మరక లేని పాలన అందించారు

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన కార్పోరేషన్ లో చేపట్టి విశాఖ ఖ్యాతిని పెంచారు. డీవీ అంటే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం. ఆయనను ఏరి కోరి రాజకీయాల్లోకి దించారు. మేధావి వర్గానికి చెందిన వారిని మేయరుగా పరిచయం చేసిన గొప్పదనం ఎన్టీఆర్ దే.

అప్పట్లో డీవీకి విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం కూడా ఇస్తారని అనుకున్నారు. సామాజిక రాజకీయ కారణాల వల్ల అది జరగలేదు. డీవీ తన జీవిత చరమాంకంలో బీజేపీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడారు.

డీవీ మరణించి ఇప్పటికి దశాబ్దం గడచింది. ఆయన చేసిన సేవలు అందరికీ గుర్తున్నాయి. అటువంటి డీవీని విశాఖ వాసులు నిత్యం స్మరించుకునేలా ఆయన కాంస్య విగ్రహం జీవీఎంసీలో పెట్టాలని ఆయన అభిమానులూ అనుచరులూ డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో జరిగిన డీవీ 93వ జయంతిని ఘనంగా వారు జరిపారు.

డీవీ సుబ్బారావు ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. అలాగే విద్యా వితరణ శీలిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞా ధురీణుడు అయిన డీవీకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.

టీడీపీలో పుట్టి బీజేపీలో రాజకీయం ముగించిన డీవీని కూటమి పాలకులు గౌరవించి ఆయన విగ్రహాన్ని జీవీఎంసీలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తాజాగా జరిగిన మేయర్ మీద అవిశ్వాసంలో కూటమి నెగ్గింది. కొత్త మేయర్ టీడీపీ నుంచే రాబోతున్నారు. బీజేపీ జనసేనలతో కలసి పాలన సాగించబోతున్న కూటమికి డీవీ ఆదర్శం కావాలని కోరుతున్నారు అంతా.

3 Replies to “డీవీ రుణం కూటమి తీర్చుకుంటుందా?”

  1. తప్పు రాసినట్టున్నారు..1981లో బెజవాడ,విశాఖ కార్పొరేషన్లు అయ్యాయి.అప్పటి ఎన్నికల్లో బెజవాడలో ఎర్ర జెండాలు ఎగిరి సీ పీ ఐ నాయకుడు వెంకటేశ్వరరావు మేయర్ అయ్యారు.విశాఖలో కాషాయ జెండా రెప రెప లాడింది..సుబ్బారావు మేయర్ అయ్యారు..ఆ తర్వాత ఏడాదికి తెలుగు దేశం పుట్టింది..

Comments are closed.