వల్లకాడు… తద్దినం…మాటల మంటలు

ఒక వైపు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. మరో వైపు వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా మాటల మంటలు రాజకీయాల్లో రేగుతున్నాయి.  Advertisement సామాజిక న్యాయ భేరీలో…

ఒక వైపు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. మరో వైపు వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా మాటల మంటలు రాజకీయాల్లో రేగుతున్నాయి. 

సామాజిక న్యాయ భేరీలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకంగా మహానాడు కాదది వల్లకాడు అనేశారు. తెలుగుదేశం పని ఏనాడో అయిపోయిందని జనాలు ఆ పార్టీని, బాబును మరచిపోయారని కూడా ఘాటైన విమర్శలు చేశారు.

ఒక విధంగా శుభమా అని మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశానికి ఈ వల్లకాడు మాట జీర్ణించుకోవడం వల్ల కాదేమో. సరే ఈ మాట ఇలా ఉంటే మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే టీడీపీకి తద్దినం పెట్టేసారు చంద్రబాబు అంటూ తనదైన దూకుడు తో అటాక్ చేశారు. 

ఏపీలో బడుగులకు అధికారం ఎపుడైనా చూశారా. దాన్ని ఆచరణలో చూపించిన ఘనత జగన్ దే అని ఆయన అంటూ చంద్రబాబును జనాలు నమ్మరంటే నమ్మరు అని తేల్చేశారు.

మొత్తానికి బీసీలకు, అణాగారిన వర్గాలకు అధికారం దక్కింది అంటూ వైసీపీ చేస్తున్న బస్సు యాత్ర వైసీపీలోని చాలా మందిని కదిలించింది. అదే విధంగా ఈ బస్సు యాత్రకు మంచి స్పందన దక్కుతోంది. దీంతో టీడీపీని వైసీపీ నేతలు గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.