Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీ అభ్యర్ధి పారాచూట్ నేత... సీఎం రమేష్ సంగతేంటి?

వైసీపీ అభ్యర్ధి పారాచూట్ నేత... సీఎం రమేష్ సంగతేంటి?

టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఏది చెబితే అదే జనాలు నమ్ముతారని భ్రమలలో ఉన్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడుతూ  పాయకరావుపేటలో  వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కంబాల జోగులుని పట్టుకుని పారాచూట్ నేత అని విమర్శించారు. ఎక్కడ నుంచో ఆయన్ని పట్టుకుని ఇక్కడ దిగుమతి చేశారు అని ఎద్దేవా చేశారు.

కంబాల జోగులు అయితే పక్క జిల్లా అయిన శ్రీకాకుళానికి చెందిన వారే. పైగా ఉత్తరాంధ్రాకు చెందిన వారే. ఈ ప్రాంతానికే సంబంధం లేని సీఎం రమేష్ కి కూటమి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి పంపించింది మరి ఆయన పారాచూట్ నేత కాదా బాబూ అంటున్నారు వైసీపీ నేతలు.

పైగా రమేష్ కి ఢిల్లీ అంతా తెలుసు. ఆయనని గెలిపించుకోండి, మీ సమస్యలు తీరుస్తారు అని బాబు చెబుతున్నారు. వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడుకు ఢిల్లీ చూడాలంటేనే ఐదేళ్ళు పడుతుందని బాబు చేసిన విమర్శల పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చట్టసభలకు నెగ్గిన వారు అంతా అక్కడ ఊర్లను చూస్తారా లేక చట్టసభలలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు ఈ సంగతి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ అభ్యర్ధులను చెత్త అంటున్న బాబు టీడీపీ అభ్యర్ధులను చాలా చోట్ల మార్చారని వారిని ఏమనాలో అని నిలదీస్తున్నారు. ఎన్నారైలకు కూడా కొన్ని చోట్ల టికెట్లు టీడీపీ ఇచ్చింది. తాము చేస్తే బ్రహ్మాండమైన ఎంపిక అని వైసీపీ చేస్తే చెత్త ఎక్కడితో తెచ్చి వేరే చోట వేస్తున్నారు అని బాబు చేస్తున్న విమర్శల పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?