చంద్రబాబు అను"కుల" పత్రికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై దిగజారుడు వార్త రాశారు. జగన్ కుటుంబంపై ఎల్లో మీడియా విషం కక్కడంలో ఈ కథనం పరాకాష్ట అనే విమర్శ వెల్లువెత్తుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర గత రాత్రి విజయవాడకు చేరుకున్న సంగతి తెలిసింది.
ఈ సందర్భంలో వేలాది ప్రజలు దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. వీరిలో వైఎస్ భారతి కూడా వుండడం విశేషం. తాడేపల్లి రోడ్డుపై వైఎస్ భారతి నిల్చొని అక్కడికి బస్సుయాత్ర రాగానే... ప్రజల్లో ఒకరిగా నవ్వుతూ జగన్కు హాయ్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ మహిళాగా సీఎం సతీమణి జనం మధ్య ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే దీన్ని ఆర్కే పత్రిక జీర్ణించుకోలేకపోయింది. ఆమె అలా ప్రజల మధ్య ఉండడంపై విషం కక్కుతూ వార్తను వండివార్చింది. "జగన్ ప్రచారంలో భారతి బిల్డప్" అంటూ తన మార్క్ విష రాత ఆర్కే పత్రిక రాయడంపై పాఠకులు, జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని భారతిపై రోత రాత రాయడం ఏంటనే ప్రశ్న జర్నలిస్టుల నుంచి వస్తోంది. మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనం నుంచి స్పందన లేకపోవడంతో జగన్ బిల్డప్ ప్రచారానికి తెరలేపారంటూ అక్కసు వెళ్లగక్కడాన్ని గమనించొచ్చు.
జగన్ బస్సు యాత్రకు వచ్చిన మహిళలు, వైసీపీ కార్యకర్తలెవరూ భారతిని పట్టించుకోలేదట. ఒకవేళ జగన్ను చూడాలని అనుకుంటే, నేరుగా కలిసి యోగక్షేమాలు తెలుసుకోవచ్చు కదా అని ఈ విష పత్రిక ఉచిత సలహా ఇచ్చింది. సామాన్య ప్రజానీకం మధ్య నిలబడి జగన్కు అభివాదం చెప్పిన భారతిపై విషం కక్కడాన్ని చూస్తే ... ఆమె ఎంత ప్రభావం చూపుతున్నదో అర్థం చేసుకోవచ్చు. భారతిపై దుర్మార్గ కథనం రాయడం ద్వారా ...పచ్చ పత్రిక నైజం మరోసారి బయట పడిందని జనాలు అభిప్రాయపడుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు