ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం వాలంటీర్ల చూట్టే తిరుగుతున్నాయి. ఇన్ని రోజులు వాలంటీర్లను తిట్టిన వారు కూడా వారిపై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. ప్రతిప్రక్షాలు చేస్తున్న విమర్శలపై కొందరు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తుండటంతో వారి రాజీనామాలు ఆమోదించకండి అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ టైంలో వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని.. ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని టీడీపీ అనుకుల వ్యక్తులు కొందరు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. దీంతో ధర్మాసనం వాలంటీర్లపై ఎటువంటి తీర్పు ఇస్తుందని ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇన్ని రోజులు వాలంటీర్లపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తీరా ఎన్నికలు రావడంతో మాట మార్చి వారికి జీతాలు పెంచుతాము, ఉపాధి ఇస్తామని చెబుతున్నా వారి మాటలను నమ్మకుండా వాలంటీర్లు రాజీనామాలు చేస్తుండటంతో వారిలో భయం మొదలైంది. వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ పార్టీ కోసం పని చేస్తారని.. వారికి అందరితో పరిచయాలు ఉండటంతో తమ పార్టీకి దెబ్బ అని భావించి వారిపై కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు