Advertisement

Advertisement


Home > Politics - Andhra

జగన్ కి తిట్లు... విశాఖకు బిస్కెట్లు!

జగన్ కి తిట్లు... విశాఖకు బిస్కెట్లు!

చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొత్తం తీసుకుంటే ఆత్మ స్తుతి పరనిందగా సాగుతూ వస్తోంది. జగన్ ని పట్టుకుని సైకో అని నిందించడం తన ప్రసంగాలలో అనేక సార్లు దారుణంగా విమర్శించడమే చేస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ వచ్చిన చంద్రబాబు జగన్ మీద షరా మామూలుగానే తిట్ల దండకం అందుకున్నారు జగన్ అసమర్ధుడు, దుర్మార్గుడు అని ఆవేశంతో అనాల్సినవి అన్నీ అనేసారు.

అదే నోటితో విశాఖను తెగ పొగిడారు. విశాఖ వాసులు మంచివారు అని కితాబు ఇచ్చారు. వీళ్ళంతా విజ్ఞులు అన్నారు. తాను 2019 ఎన్నికల్లో ఏపీ అంతా తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకుని రావద్దు అంటే అంతా జగన్ మాయలో పడి ఓటేస్తే విశాఖ వాసులే తన మాట విని టీడీపీని గెలిపించారు అని చంద్రబాబు మెచ్చుకున్నారు.

జగన్ తల్లి విజయమ్మని ఓడించిన విశాఖ అంటూ సంబరపడ్డారు. విశాఖకు తన గుండెలలో స్థానం ఉందని ఎంతో అభివృద్ధి చేయాలని అనుకున్నామని ఐటీ రాజధాని ఆర్ధిక రాజధాని అని చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన చంద్రబాబు విశాఖను రాజధానిగా మాత్రం చెప్పలేకపోయారు. విశాఖకు ఆ అర్హత ఉందని తెలిసినా మేధావులు చెబుతున్నా బాబు నోట మాత్రం ఆ మాట రానే రాదు అని అంటున్నారు. విశాఖ ఓట్లు కావాలి, విశాఖకు మాత్రం రాజధాని హోదా దక్కరాదు. ఇదే బాబు విధానమా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

విశాఖని తాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను అని బాబు చెబుతున్నారు. అయితే వైఎస్సార్ టైం లోనే విశాఖకు ఐటీ టవర్ అయిన సెజ్ లు అయినా వచ్చాయని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖ ప్రజలు మంచోళ్ళు బుద్ధిమంతులు అంటూ బాబు ఇస్తున్న కితాబులను చూసి జనాలు ముఖాలను మతాబులు చేసుకోవాలా అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?