Advertisement

Advertisement


Home > Politics - Andhra

అన్న‌పై దాడి ఖండ‌న‌లోనూ ష‌ర్మిల నీచ‌త్వం!

అన్న‌పై దాడి ఖండ‌న‌లోనూ ష‌ర్మిల నీచ‌త్వం!

త‌న అన్న, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై దాడిని ఖండించ‌డంలోనూ ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల నీచ‌త్వాన్ని బ‌య‌ట పెట్టుకున్నారు. జ‌గ‌న్‌పై దాడిని ఖండిస్తూనే, మ‌రోవైపు ఎవ‌రో చేసిన‌ట్టు లేద‌ని ఆమె పేర్కొన‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్‌పై దాడి ఖండ‌న‌లో ష‌ర్మిల ప్ర‌యోగించిన ప్ర‌తి అక్ష‌రాన్ని నెటిజ‌న్లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి, త‌మ‌దైన ప్ర‌తి స్పంద‌న తెలియ‌జేస్తున్నారు.

ఎక్స్ వేదిక‌గా శ‌నివారం జ‌గ‌న్‌పై దాడిని ఆమె ఏ విధంగా ఖండించారో తెలుసుకుందాం.

"ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను"

ష‌ర్మిల పోస్ట‌పై నెటిజ‌న్లు పోస్టుమార్టం చేశారు.

"ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం"  అనే ఈ  పోస్టులోని వాక్యం షర్మిల మనసులోని అసహ్యాన్ని, అన్న‌పై అక్క‌సును  బయటపెట్టింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. అంత గురిగా తగిలిన రాయి ప్రమాదవశాత్తు వచ్చి తగులుతుందా ? ఇలాంటి తప్పుడు ఆలోచ‌న‌ చంద్రబాబు, ప‌వ‌న్‌, లోకేశ్‌ల‌కో  వ‌చ్చి వుంటే స‌ర్లే అని స‌రిపెట్టుకోవ‌చ్చు, కానీ ఓ చెల్లికి రావడం ఎవరైనా ఊహించగలరా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

అనుకుంటున్నాం అని అంటే...చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ త‌దిత‌ర ప్ర‌తిప‌క్ష‌నేత‌లా? అని ష‌ర్మిల‌ను నెటిజ‌న్లు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఇదే రాయి కణతకు తగిలి ఉంటే జగన్‌కు  ప్రాణాపాయం సంభవించి ఉండవచ్చ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఒక‌వేళ  కంటికి తగిలి ఉంటే చూపు శాశ్వతంగా పోయి ఉండేద‌ని నెటిజ‌న్లు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డాన్ని చూడొచ్చు.

ప్ర‌మాద‌వ‌శాత్తు ఈ ట్వీట్‌ను ష‌ర్మిల చేశారా? అనే అనుమానం త‌లెత్తుతోంద‌ని నెటిజ‌ర్లు చుర‌క‌లు అంటిస్తున్నారు. రాజ‌కీయంగా అన్న‌తో విభేదించి వుంటే ఇలాంటి పోస్టు ఆమె నుంచి వ‌చ్చేది కాదంటున్నారు. జ‌గ‌న్‌ను తీవ్రంగా ద్వేషించ‌డం వ‌ల్లే క‌నీసం దాడిని మొద‌టి వాక్యాల్లో ఖండించ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

ష‌ర్మిల ఖండ‌న పోస్టుతో జ‌గ‌న్‌పై ఆమె ఎంత‌గా ర‌గిలిపోతున్నారో అర్థం చేసుకోడానికి ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ష‌ర్మిల మ‌న‌సులోని ద్వేషాన్ని, ఉక్రోశాన్ని ఆ పోస్టు ప్ర‌తిబింబిస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేయ‌డం విశేషం.  

మహా చెల్లీ ! నీకు ధన్యవాదాలు ! అని నెటిజ‌న్లు వెట‌క‌రిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?