నరసాపురం రఘురామకృష్ణంరాజు అంటే మామూలు వ్యక్తి కాదు. ఎవరైతే ఆదరిస్తారో, వాళ్లనే తిడుతుంటారనే ప్రచారం వుంది. నిన్నమొన్నటి వరకూ వైసీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలా తిట్టారో అందరికీ తెలుసు. వారిని తిట్టడం ఇంతటితో ఆగదు. అది వేరే సంగతి.
తాజాగా కూటమి పార్టీలను తిట్టడం మొదలు పెట్టారు. నరసాపురం ఎంపీ బరిలో మరోసారి వుంటానని ప్రతి వేదికపై నుంచి ఆయన చెబుతూ వచ్చారు. విజయనగరం ఎంపీ లేదా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడైనా అసెంబ్లీ సీటును రఘురామకు ఇచ్చే అవకాశం వుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. అక్కడికి వెళ్లాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. నర్సాపురం టికెట్ను టీడీపీ తనకు ఇవ్వాల్సిందే అని ఆయన అన్నారు.
పనిలో పనిగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఘాటు విమర్శలు చేశారు. పురందేశ్వరి పదవులు అనుభవించి వస్తే బీజేపీలో సీటు ఇచ్చారని మండిపడ్డారు. వీర్రాజు కంటే పురందేశ్వరి సీనియరా అని నిగ్గదీశారు. రాజమండ్రి లోక్సభ టికెట్కు అనర్హుడా అని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో వీర్రాజు, అనకాపల్లిలో మాధవ్ కు సీటు ఇచ్చి ఉంటే సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని నమ్మే అవకాశం ఉండేదన్నారు.
దగ్గుబాటి పురందేశ్వరి పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వంలో పదవులు అనుభవించారని, అలాంటి వ్యక్తికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ సందర్భంలో మహిళా యాంకర్ ఓకే.. అని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేయగా... రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అసలైన పాయింట్ అంటూ రెచ్చిపోయారు. బీజేపీ, జగన్ ఒకటి కానప్పుడు నరసాపురంలో టికెట్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం వుండకూడదన్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు