కర్ణాటక ఐపోయింది, బీజేపీ నెక్ట్స్ టార్గెట్ అదేనట!

మొన్నటి వరకూ ఈవీఎంలలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి పడిపోతోందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తంచేశారు. అది అర్థంలేదని ఆందోళన అని కాస్త ఎరిగిన వాళ్లంతా చెప్పారు. ఓడిపోయినవారు సాకుగా ఆ మాట చెబుతున్నారని స్పష్టమైంది.…

మొన్నటి వరకూ ఈవీఎంలలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి పడిపోతోందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తంచేశారు. అది అర్థంలేదని ఆందోళన అని కాస్త ఎరిగిన వాళ్లంతా చెప్పారు. ఓడిపోయినవారు సాకుగా ఆ మాట చెబుతున్నారని స్పష్టమైంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు ఏ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అయినా బీజేపీలోకి చేరిపోతూ ఉండటమే ప్రజాస్వామ్యానికి పెద్ద అపహాస్యంగా మారింది. దేశంలో కమలం పార్టీ ఫిరాయింపుల రాజకీయం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులకు ప్రజలు పట్టంకట్టిన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆ పార్టీనే అధికారం చేపడుతూ ఉంది.

కర్ణాటకలో తమకు స్పష్టమైన మెజారిటీ లేకపోయినా బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది! మెజారిటీని కలిగి ఉండిన సంకీర్ణ సర్కారు పడిపోగా.. మెజారిటీ లేకపోయినా బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది.  ఇదంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రక్రియే! ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మధ్యప్రదేశ్ మీద గురి ఎక్కు పెట్టిందట బీజేపీ. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా. ఇదంతా జరిగి కొన్ని నెలలే అవుతోంది.

అయితే కాంగ్రెస్ కు బోటాబోటీ మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పరిణామాలను ఆసరాగా చేసుకుని అక్కడా ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి కమలం పార్టీ రెడీ అవుతోందట. బీజేపీ మిషన్ కర్ణాటకలో ముగిసిందని, మధ్యప్రదేశ్ లో మొదలు కాబోతోందని కమలం పార్టీ వాళ్లు  గర్వంగా చెప్పుకుంటున్నారు! 

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు