కమ్మ వర్గాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కమ్మ సామాజికవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని గన్నవరం ఎమ్మెల్యే, టిడిపి నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీమోహన్ వ్యాఖ్యానించారు. Advertisement చంద్రబాబు ప్రతిదానికి కులం రంగు పులుముతుండడంతో కమ్మ…

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కమ్మ సామాజికవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని గన్నవరం ఎమ్మెల్యే, టిడిపి నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీమోహన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రతిదానికి కులం రంగు పులుముతుండడంతో కమ్మ సామాజికవర్గానికి తీరని నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.

విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగి పది మంది చనిపోతే డాక్టర్ రమేష్ ను చంద్రబాబు ఎందుకు వెనుకేసుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

విశాఖ ఎల్జి పాలిమర్స్ లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, లోకేష్ లు ఇప్పుడు, విజయవాడ ఘటనలో మాత్రం రమేష్ బాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ద్వజమెత్తారు.

రమేష్ బాబు కరోనా చికిత్సలకు నిబంధలనకు విరుద్దంగా లక్షలు వసూలు చేస్తున్నది నిజం కాదా అని వంశీ ప్రశ్నించారు.