ఫరూక్ అబ్దుల్లాకు సపోర్ట్ గా పోవేం చంద్రబాబు!

ఇక్కడి ముస్లిం ఓట్లను పొందడానికి ఫరూక్ అబ్ధుల్లాను కశ్మీర్ నుంచి రప్పించుకుని ప్రచారం  చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫరూక్ అబ్దుల్లాను తెలుగుదేశం అధినేత ప్రచారానికి పిలిపించుకున్న సంగతి తెలిసిందే.…

ఇక్కడి ముస్లిం ఓట్లను పొందడానికి ఫరూక్ అబ్ధుల్లాను కశ్మీర్ నుంచి రప్పించుకుని ప్రచారం  చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫరూక్ అబ్దుల్లాను తెలుగుదేశం అధినేత ప్రచారానికి పిలిపించుకున్న సంగతి తెలిసిందే. మండుటెండల్లో గొడుగు పట్టించుకుని మరీ చంద్రబాబు కోసం ప్రచారం చేశారు అబ్దుల్లా. తమ కశ్మీర్ లో ఇలాంటి ఎండలు చూసి ఎరగమని ఆయన వాపోయారు. అలా తన జన్మలో చూడని ఎండలను తట్టుకుని చంద్రబాబు కోసం ప్రచారం చేశారు అబ్దుల్లా.

తన వంతుగా జగన్ మీద ఏదో మాట్లాడేసి వెళ్లిపోయాడాయన. మరి తనకోసం అంతచేసిన అబ్దుల్లా ఇప్పుడు వాపోతూ ఉన్నారు. తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ, తన ఇంటి ముందు ఒక ఎస్పీ కూర్చుని ఉన్నాడంటూ, తనను బయటకు రానివ్వడం లేదంటూ ఆయన వాపోతున్నారు. కశ్మీర్ విషయంలో మోడీ నిర్ణయాలను బాగా వ్యతిరేకిస్తున్న వాళ్లలో ఈ చంద్రబాబు దోస్తు ముందున్నారు. మరి అలాంటి అబ్దుల్లాకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడంలేదు.

అప్పుడేమో మోడీని, జగన్ ను తిట్టించడానికి ఫరూక్ అబ్ధుల్లాను చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. తన పని చేయించుకున్నారు. ఇప్పుడేమో అబ్దుల్లా వాపోతున్నా చంద్రబాబు నాయుడు అస్సలు స్పందించడం లేదు! ఇప్పుడు కూడా మోడీనే తిడుతున్నారు అబ్దుల్లా. అప్పుడు మోడీని దించడానికి ఏకం అయినట్టుగా చంద్రబాబు నాయుడు-అబ్దుల్లా ప్రకటించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం అబ్దుల్లా ఆవేదనను పట్టించుకుంటున్నట్టుగా కనిపించడం లేదు!

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?