భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
చిన్న వయసులోనే భారత క్రికెట్ టీంలో చోటు దక్కించుకున్న సచిన్ ఆకట్టుకునే బ్యాటింగ్తో అంచెలంచెలుగా ఎదుగుతూ యావత్ ప్రపంచ వ్యాప్తంగా విశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.
సచిన్కు కరోనా అని తెలియగానే ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తనకు కరోనా నిర్ధారణ కావడంపై సచిన్ ఏమన్నారో తెలుసుకుందాం.
కరోనా టెస్ట్ చేయించుకోగా స్వల్ప లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యిందన్నారు. కుటుంబంలో మిగిలిన వారికి నెగెటివ్ అని తేలిందన్నారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నానని చెప్పారు.
ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సచిన్ తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఆరోగ్య సిబ్బంది, మిగిలిన అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.