తృతీయ ప్రపంచ మానవాళికి శుభవార్త. కరోన నిరోధక కృషి లో ' విశ్వసనీయ మైన' పెద్ద ముందడుగు పడబోతోంది. భీకరమైన నిశ్శబ్దంగా పడబోతోంది. త్వరలో- మన దేశం నుంచి…., మన తెలుగు తేజం నుంచి…., కరోనా పీచమనచడానికి వాక్సిన్ వస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో రెండు వాక్సిన్ లకు 'అనుమతి' లభించింది. అందులో ఒక దానికి- 'ఇఫ్' లు, 'బట్' లు బోలెడన్ని. కానీ, ఆ విషయాన్ని ఆ వాక్సిన్ వాళ్ళూ చెప్పరు. దానిని భుజాన వేసుకుని ఊరేగే మీడియా కూడా చెప్పదు.
ఎందుకంటే- వారి మధ్య బంధుత్వం ఉంది(ట). వారి మనవరాలిని వీరి అబ్బాయి వివాహమాడారు(ట). ఒకరికి జలుబు చేస్తే…రెండో వారికి తుమ్ము వస్తుంది(ట). పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి (ట), మరి. అందుకే- 'వాక్సిన్ వచ్చేసిందహో…' అంటూ రోజూ ఫ్రంట్ పేజీ టముకు.
అయితే.. పెట్టుడు మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టి….టముకు వేసుకునే వ్యాపార సంస్కృతి కి భిన్నం గా – మన తెలుగు గడ్డ పై నుంచే మరో వాక్సిన్ రాబోతోంది.
హెపటైటిస్ -బీ అనే భయంకరమైన అంటువ్యాధికి వాక్సిన్ ను కనుగొనడమే గాక అతి తక్కువ ధరలకు తృతీయ ప్రపంచ దేశాలకు అందించిన 'శాంత' బయోటెక్ సంస్థ నుంచి ఈ వాక్సిన్ రాబోతోంది.
ముందు నుంచే – 'రాబోతోందహో….', 'వాటర్ బాటిల్ కంటే కూడా చౌక గా ఇస్తామహో…' అంటూ ముందుకు ముందే టముకు వేసుకునే అలవాటు -'శాంత' బయోటెక్ కు మొదటి నుంచీ లేదు. అందువల్లే- ఈ సంస్థ వ్యవస్థాపక అధినేత- కే. ఐ. వరప్రసాద్ రెడ్డి- దీని గురించి నోరు మెదపడం లేదు. ఇతర వర్గాల ద్వారా తెలిసి, ఆయనను అడిగిన వారితో- 'నో కామెంట్ ప్లీజ్' అన్నట్టు తెలిసింది. శుభం.
భోగాది వేంకట రాయుడు