సీపీఐకి రోజా వినూత్న నిర్వ‌చ‌నం

వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా సీపీఐ అగ్ర‌నాయ‌కుడు నారాయ‌ణ‌పై విరుచుకుప‌డ్డారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి నారాయ‌ణ త‌ల‌వంపులు తెస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. (రోజా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో నారాయ‌ణ స్వ‌గ్రామం కావ‌డం గ‌మ‌నార్హం) గ్రామాల్లో…

వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా సీపీఐ అగ్ర‌నాయ‌కుడు నారాయ‌ణ‌పై విరుచుకుప‌డ్డారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి నారాయ‌ణ త‌ల‌వంపులు తెస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. (రోజా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో నారాయ‌ణ స్వ‌గ్రామం కావ‌డం గ‌మ‌నార్హం) గ్రామాల్లో 1.50 సెంటు, ప‌ట్ట‌ణాల్లో ఒక సెంటు స్థ‌లాన్ని పేద‌ల‌కు పంచుతున్న విష‌యం తెలిసిందే.

పేద‌ల‌కు త‌క్కువ ఇంటి స్థ‌లాన్ని పంపిణీ చేయ‌డంపై నారాయ‌ణ విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. సీఎం జ‌గ‌న్ ఇంట్లో కుక్క‌లను క‌ట్టేసేంత స్థ‌లం కూడా పేద ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డం లేద‌ని నారాయ‌ణ చేసిన ఘాటు విమ‌ర్శ‌ల‌పై రోజా అంతే తీవ్రంగా స్పందించారు. క‌మ్యూనిస్టులు ధ‌ర్నాలు చేయ‌కుండానే ముఖ్య‌మంత్రి ఇంటి ప‌ట్టాలు ఇస్తున్నార‌ని రోజా అన్నారు.

అసలు త‌న స్వ‌స్థ‌ల‌మైన నగరికి నారాయ‌ణ ఏం చేశారని ఆమె గ‌ట్టిగా ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రాజ‌కీయ పార్టీకి రోజా స‌రికొత్త నిర్వ‌చ‌నం చెప్పుకొచ్చారు.

సీ.పీ.ఐ. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికి తెలుసునని..కానీ దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ చేశారని రోజా విమర్శించారు. మొత్తానికి రోజా పంచ్ అదిరింద‌నే టాక్ వినిపిస్తోంది. సీపీఐపై రోజా విసుర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ఇళ్ల పట్టాలు నిరంతర ప్రక్రియ