దగ్గుబాటి వైసిపికి దూరం

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. Advertisement గత ఎన్నికలలో పర్చూరు నుంచి పోటీచేసి దగ్గుబాటి ఓడిపోయిన…

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి.

గత ఎన్నికలలో పర్చూరు నుంచి పోటీచేసి దగ్గుబాటి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాలంలో వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి బిజెపి నేతగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్తితి నేపద్యంలో దగ్గుబాటి దంపతులు ఏదో ఒక పార్టీలో ఉంటే మంచిదని వైసిపి నాయకత్వం సూచించిందని సమాచారం .

ఆ తర్వాత కుటుంబ పరంగా చర్చించుకుని వారు వైసిపి కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియచేశారని కదనం.

కాగా పర్చూరులో మరో నేత రామనాదబాబును వైసిపిలోకి తీసుకున్న సమచారం తమకు తెలియని దగ్గుబాటి పేర్కొన్నారు.