కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణలో రాజకీయ వేడిని రగుల్చుతోంది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, జాతీయ అధికార పార్టీ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం పూర్తియన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు.
తనకు మాత్రమే సొంతమైన వెటకారంతో మోడీ సర్కార్పై విరుచుకుపడ్డారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ వంచన చేసుకున్నారని ఘాటు విమర్శ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు బీజేపీ తెలంగాణ నాయకులు ఒక్కొక్కరుగా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కల్వకుంట చంద్రశేఖరరావు కాదు… కంత్రీ చంద్రశేఖరరావు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.
కేసీఆర్పై డీకే అరుణ విమర్శలేంటో తెలుసుకుందాం. ప్రధాని కుర్చీ కోసం ….వేల కోట్లను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ పంపుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. బూతు పురాణం మానుకోకుంటే కేసీఆర్ నాలుక తెగ్గోస్తామని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తనను చెప్పులతో కొట్టడానికి ప్రజలు సిద్ధమైనట్టు కేసీఆర్ గ్రహించారన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కుదరదని ఆమె తేల్చి చెప్పారు. మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అలాగే దేశ ప్రధానిపై మెంటల్, పిచ్చి ఎక్కినట్లు కేసీఆర్ మట్లాడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. ఒకటి తిట్టి.. నాలుగు తిట్టించుకోవటం కేసీఆర్కు అలవాటుగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు.
కేసీఆర్ను సీఎంగా గుర్తించటానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడ్తున్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ గురించి మాట్లాడే అర్హత అవినీతి సామ్రాట్ కేసీఆర్కు లేదన్నారు. పాస్ పోర్ట్ బ్రోకర్ కేసీఆర్కు ..లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అరుణ ప్రశ్నించారు.