Advertisement

Advertisement


Home > Politics - Gossip

బొత్స పంక్షన్ లో అతిరథులు

బొత్స పంక్షన్ లో అతిరథులు

ఆంధ్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహ నిశ్చితార్థం మహా వేడుకగా జ‌రిగింది. 

హైదరాబాద్ పార్క్ హయాత్ లో జ‌రిగిన కార్యక్రమానికి రాజ‌కీయ రంగ అతిరధ, మహారధులు అందరూ హాజ‌రయ్యారు. దాదాపు ఆంధ్ర మంత్రులు అంతా హాజ‌రయ్యారు. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అవంతి, గంటా, కన్నబాబు, పెద్దిరెడ్డి, ఇలా పెద్దలంతా వచ్చారు. రాజ‌కీయ ప్రముఖుల్లో కేవిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ నుంచి హరీష్ రావు, కేశవరావు, బండ్ల గణేష్ వచ్చారు. వైకాపా నేతలు అంతా ఓ దగ్గర చేరడం, వైఎస్ కాలంలో వున్న వారు కొందరు రావడం, కేవిపి వుండడం అంతా కోలాహలంగా మారింది.

హాజ‌రయిన కాపు ప్రముఖులు అంతా మెగాస్టార్ చుట్టూ చేరడం, ఆయనతో వీలయినంత ఎక్కువ సేపు గడపడం విశేషం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?