Advertisement

Advertisement


Home > Politics - Gossip

అన్నయ్య సెంట్రల్ మినిస్టర్ అవుతాడు-పవన్

అన్నయ్య సెంట్రల్ మినిస్టర్ అవుతాడు-పవన్

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భాజపా మీద చాలా భరోసానెే పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తన సోదరుడు నాగబాబు కేంద్ర మంత్రి అవుతారని ఆయన బలంగా నమ్ముతున్నారు.

విశాఖ వెళ్లిన‌ప్పుడు విశాఖ పార్టీ నాయకులను కలిసినప్పుడు పవన్ ఈ మేరకు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ‘అన్నయ్య నాగబాబు గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతారు.. మీరంతా కలిసి గట్టిగా పని చేసి అన్నయ్యను గెలిపించాలి’ అని పవన్ చెప్పినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే పవన్ అక్కడితో ఆగలేదని, నాగబాబు విజయం కోసం కావాల్సిన నిధుల సమీకరణ బాధ్యతలు కూడా విశాఖ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరుల మీద పెట్టినట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సంపన్న బిజినెస్ పీపుల్ నుంచి సేకరించాలని సూచించినట్లు తెలుస్తోంది.

నాగబాబు అనకాపల్లి పోటీకి 70 కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుందని ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నిధులు విశాఖ ప్రాంతంలోనే మాగ్జిమమ్ విరాళాల రూపంలో తెచ్చుకోవాలనే ఆలోచనలు సాగుతున్నాయి.

అయితే విశాఖలో కీలకంగా వున్న ఇద్దరు బ్రదర్స్ టికెట్ లు ఆశిస్తున్నారు. కానీ ఒకరికే వచ్చేలా వుంది. ఇద్దరికీ ఇస్తే ఆ పార్టీ ఫండ్ మొత్తం తామే ఇస్తామనే ప్రతిపాదన చేసినట్లు కూడా పార్టీ వర్గాల్లో వినినిపిస్తోంది. మరోపక్క పెందుర్తి, గాజువాక, భీమిలి జనసేన అడుగుతుంటే అక్కడ వున్న తెలుగుదేశం నాయకులు గట్టిగా పట్టుపట్టి వున్నారు. దాంతో అదో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?