రాజుకు అంతటితో సరా?

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు పదవులు దక్కేది ఉందా లేదా అన్నది ఆయన అభిమానులు, అనుచరులలో చర్చ సాగుతోంది. Advertisement క్షత్రియ సామాజికవర్గానికి ఈసారి…

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు పదవులు దక్కేది ఉందా లేదా అన్నది ఆయన అభిమానులు, అనుచరులలో చర్చ సాగుతోంది.

క్షత్రియ సామాజికవర్గానికి ఈసారి మంత్రివర్లంలో స్ధానం కల్పించలేదు. అశోక్‌ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రి అయ్యేవారు, కీలకమైన శాఖలే చూసేవారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజుకు టిక్కెట్‌ అడిగి గెలిపించుకున్నారు. ఆమెకు మంత్రివర్గంలో స్ధానం దక్కుతుంది అనుకుంటే బీసీలకు ఛాన్స్‌ ఇచ్చారు.

అదే సమయంలో అశోక్‌ గజపతిరాజు స్ధాయికి తగినట్లుగా టీటీడీ చైర్మన్‌ పదవి అయినా లేదా గవర్నర్‌ పదవి అయినా ఇస్తారని ప్రచారం సాగింది. టీటీడీ చైర్మన్‌ పదవి విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. దాంతో గవర్నర్‌ పదవి అశోక్‌కి దక్కుతుందా లేక ఆయనను అలా పక్కన పెట్టేస్తారా అన్నది కూడా అనుచరులలో చర్చగా ఉంది.

రాజ్యసభ పదవి ఇవ్వాలనుకున్నా మరో రెండేళ్ల పాటు వేచి చూడాల్సి వస్తుంది. అదే సమయంలో చాలామంది ఆశావహులు రేసులో ఉన్నారు. మొత్తానికి పెద్దాయనకు ఏ పదవి ఇస్తారు అన్నదే చూడాలని అంటున్నారు.

10 Replies to “రాజుకు అంతటితో సరా?”

  1. ఆయన గురించి ఆర్టికల్ రాయటం కాదు ఆయన కాలిగోరు ముట్టుకునే అర్హత కూడా నీకు, నీ బాస్ కి లేదు !!

  2. మూతవేత దిశగా టీడీపీ పార్టీ.

    2029 లోపు బాబు చనిపోతాడు. లే .కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది 

    ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది

Comments are closed.