Advertisement

Advertisement


Home > Politics - Gossip

టీడీపీ నేత జాత‌కాన్ని మార్చిన విదేశీ ప‌ర్య‌ట‌న‌!

టీడీపీ నేత జాత‌కాన్ని మార్చిన విదేశీ ప‌ర్య‌ట‌న‌!

ఒకే ఒక్క విదేశీ ప‌ర్య‌ట‌న ఆ టీడీపీ నాయ‌కుడి జాత‌కాన్ని మార్చేసింది. స్వామి, స్వ‌కార్యం అన్న చందంగా... పార్టీ పేరుతో విదేశాల్లో ప‌ర్య‌టించి, అక్క‌డి విరాళాల‌తో సొంతింటిని చ‌క్క‌బెట్టుకున్న‌ట్టు టీడీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. 

ఇటీవ‌ల కొంద‌రు టీడీపీ నాయ‌కులు విదేశాల్లో ప‌ర్య‌టించారు. వీరిలో ప్ర‌ధానంగా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ నాయ‌కుడికి విదేశీ ప‌ర్య‌ట‌న బాగా గిట్టుబాటు అయ్యింద‌నే టాక్ వినిపిస్తోంది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌మ సామాజిక వ‌ర్గాన్ని అణిచివేస్తున్నార‌నే ఆవేద‌న‌లో ఓ వ‌ర్గం ఉంది. దీంతో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆ సామాజిక వ‌ర్గం క్యాంపెయిన్ నిర్వ‌హిస్తోంది. 

ఇటీవ‌ల విదేశాల్లో టీడీపీ అభిమానులు మ‌హానాడు నిర్వ‌హించారు. ఆ కార్య‌క్ర‌మాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కొంద‌రు సీనియ‌ర్‌, జూనియ‌ర్ టీడీపీ నాయ‌కులు వెళ్లారు. ఈ ప‌ర్య‌ట‌న‌ను ఒక నాయ‌కుడు బాగా సొమ్ము చేసుకున్నార‌నే విమ‌ర్శ ఉంది.

జ‌గ‌న్‌పై నోరు పారేసుకుని, వైఎస్సార్‌సీపీ అభిమానుల దాడికి గురైన స‌ద‌రు నాయ‌కుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భారీ మొత్తంలో ల‌బ్ధి పొందార‌నే ప్ర‌చారం టీడీపీ స‌ర్కిల్స్‌లో జ‌రుగుతోంది. 

పార్టీ కోసం విరాళాలు తీసుకురావ‌య్యా బాబూ అంటే.... హాయిగా ఒకే ఒక్క ప‌ర్య‌ట‌న‌తో జీవిత కాలానికి స‌రిప‌డేలా చ‌క్క‌దిద్దుకొచ్చాడ‌ని అత‌నిపై సొంత పార్టీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

జ‌గ‌న్‌పై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం ఒక్క‌టే అత‌న్ని చంద్ర‌బాబు, లోకేశ్‌కు ద‌గ్గ‌ర చేసింద‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు ఎంపీ కేశినేని నాని ద‌గ్గ‌ర గుమాస్తా గిరి వెల‌గ‌బెట్టాడ‌ని అత‌ని గురించి చెబుతుంటారు. ముఖ్య‌ నాయ‌కుల అండ చూసుకుని, సొంత పార్టీ నాయ‌కుల్నే అణిచివేస్తుండ‌డంతో వారంతా మండిప‌డుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?