ర‌గిలిన గుత్తా జ్వాల‌

క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం చోటు చేసుకోవ‌డంపై ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ర‌గిలిపోయారు. నీచ రాజ‌కీయాలుగా ఆమె అభివ‌ర్ణించారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై గుత్తా జ్వాల నిర్భ‌యంగా త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తుంటారు. ఈ…

క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం చోటు చేసుకోవ‌డంపై ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ర‌గిలిపోయారు. నీచ రాజ‌కీయాలుగా ఆమె అభివ‌ర్ణించారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై గుత్తా జ్వాల నిర్భ‌యంగా త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తుంటారు. ఈ సంద‌ర్భంగా పాల‌కుల‌పై ధిక్కార స్వరాన్ని వినిపించ‌డానికి కూడా ఆమె వెనుకాడ‌ని నైజాన్ని ప‌లు సంద‌ర్భాల్లో చూశాం.

క‌ర్నాట‌లో ముస్లిం విద్యార్థులు ఎప్ప‌ట్లాగే హిజాబ్ ధ‌రించి చ‌దువుకోడానికి వెళితే అభ్యంత‌రం చెప్ప‌డం వివాదాస్ప‌ద‌మైంది. దీన్ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ప్రోత్స‌హించ‌డాన్ని ప్ర‌జాస్వామిక‌, లౌకిక వాదులు త‌ప్పు ప‌డుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా, కుట్ర‌పూరితంగా వివాదాన్ని సృష్టిస్తోంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

క‌ర్నాట‌క‌లో హిజాబ్ ప‌రిణామాల‌పై గుత్తా జ్వాల త‌న మార్క్ స్పంద‌న తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

'చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావిస్తారు. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అని గుత్తా జ్వాల‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ ద్వారా మ‌రోసారి త‌న సామాజిక స్పృహ‌ను గుత్తా వెల్ల‌డించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.