చంద్రబాబు ఓ సన్నాసి.. కొడాలి కౌంటర్లు

రాజధాని అమరావతి ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొడాలి నాని. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఉన్న భూమిని, రాజధాని అంశాన్ని గాలికి వదిలేసి కేవలం గ్రాఫిక్కులు, సెట్టింగులకు చంద్రబాబు ముద్దుపెట్టారని..…

రాజధాని అమరావతి ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొడాలి నాని. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఉన్న భూమిని, రాజధాని అంశాన్ని గాలికి వదిలేసి కేవలం గ్రాఫిక్కులు, సెట్టింగులకు చంద్రబాబు ముద్దుపెట్టారని.. ఇన్నాళ్లకు చంద్రబాబుకు జ్ఞానోదయమై అమరావతి భూమిని ముద్దాడారని అన్నారు.

“చంద్రబాబు తప్పుడు కార్యక్రమాల్ని దగ్గరుండి గమనించారు కాబట్టే ప్రజలు రాష్ట్రంతో పాటు అమరావతి ప్రాంతంలో 3 చోట్ల కూడా ఓడించారు. గ్రాఫిక్స్, డ్రామాలు లేకుండా అమరావతిపై ఉన్న వాస్తవాలు చెబుతున్నారు జగన్. అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటుంటే.. సన్నాసిలాగ మధ్యలో వచ్చి చంద్రబాబు చెడగొడుతున్నాడు.”

ఇలా చంద్రబాబును సన్నాసితో పోల్చిన కొడాలి నాని, అధికారంలో ఉన్నప్పుడు తన బినామీల కోసం మాత్రమే బాబు పనిచేశారని..  అందుకే ఇప్పుడు రాజధాని ప్రాంతానికి వచ్చిన బాబుపై చెప్పులు పడ్డాయని విశ్లేషించారు.

“కొంతమంది రైతాంగం, రైతుకూలీలు అడ్డుపడ్డారు. దళితుల పొలాలకు ముందు ప్యాకేజీ ఇవ్వమన్నారు. బాబు, తన బినామీలతో వాటిని కొనిపించి, అప్పుడు వాటికి ప్యాకేజీలు ఇప్పించారు. వాళ్లంతా ఎదురుతిరిగి చంద్రబాబు మీద ఇప్పుడు చెప్పులేశారు. ఇప్పటికైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకుంటే మంచిది.”

చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ధి వచ్చినందుకు సంతోషం వ్యక్తంచేశారు నాని. చంద్రబాబుకు కళ్లు పైనుంచి కిందకు దిగాయని, అందుకే ఆయన నేలను ముద్దాడారని అన్నారు. ఇకనైనా చంద్రబాబు, రాజధాని ప్రాంతానికి వచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే చెప్పుల దాడి నుంచి తప్పించుకోవచన్నారు నాని.